తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల | Schedule Released For Two Mlc Posts In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల

Jan 4 2024 4:18 PM | Updated on Jan 4 2024 6:00 PM

Schedule Released For Two Mlc Posts In Telangana - Sakshi

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ విడుదల చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 11న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 29న పోలింగ్‌ జరగనుంది.

ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరిద్దరూ ఎమ్మెల్యే కోటా కిందనే ఎన్నికయ్యారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.

జనవరి 11న నోటిఫికేషన్‌
నామినేషన్ల దాఖలుకు చివరితేదీ జనవరి 18
జనవరి 19న నామినేషన్ల స్క్రూట్నీ
నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ జనవరి 22
జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌, కౌంటింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement