ఆంధ్రజ్యోతిది జర్నలిజమా.. శాడిజమా?: కవిత | MLC Kalvakuntla Kavitha Fires On Andhra Jyothy Journalism Over Party Change News On Her | Sakshi
Sakshi News home page

ఆంధ్రజ్యోతిది జర్నలిజమా.. శాడిజమా?: కవిత

May 29 2025 6:18 AM | Updated on May 29 2025 10:24 AM

MLC Kalvakuntla Kavitha Fires On Andhra Jyothy

ఆ పత్రిక కథనాలపై కవిత ఫైర్‌ 

కొత్త పార్టీ పెడతారని, కాంగ్రెస్‌లో చేరికకు రాయబారమని రాయడంపై సీరియస్‌

సాక్షి, హైదరాబాద్‌: పార్టీలో సముచిత స్థానం ఇవ్వకుంటే తాను కొత్త పార్టీ పెడతానంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై ఎమ్మెల్సీ, కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కాంగ్రెస్‌లో చేరేందుకు రాయబారం చేస్తున్నారని వచ్చిన కథనంపైనా ఆమె మండిపడ్డారు. 

హస్తం గూటికి చేరుకునేందుకు మధ్యవర్తి ద్వారా కవిత సంప్రదింపులు జరుపుతున్నారంటూ ఆ పత్రికలో రాయడంపై బుధవారం ‘ఎక్స్‌’వేదికగా సీరియస్‌ అయ్యారు. ‘కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా లేక శాడిజమా?’అని ప్రశ్నించారు. కేసీఆర్‌తో తాడోపేడో తేల్చుకోవాలని కవిత అనుకుంటున్నారని సదరు పత్రికలో వచ్చిన కథనంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement