హిల్టప్‌పై కేటీఆర్‌ పచ్చిఅబద్ధాలు | Minister Sridhar Babu Slams KTR | Sakshi
Sakshi News home page

హిల్టప్‌పై కేటీఆర్‌ పచ్చిఅబద్ధాలు

Nov 21 2025 7:18 PM | Updated on Nov 22 2025 2:55 AM

Minister Sridhar Babu Slams KTR

పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్‌ 

ఉపాధి అవకాశాలు పెంచాలనే మా ఉద్దేశాలను 

వక్రీకరిస్తున్నారు.. భూముల కన్వర్షన్‌ కోసం 

ఫీజు వసూలును రూ. 5 లక్షల కోట్ల కుంభకోణంగా దుష్ప్రచారం చేస్తున్నారు 

హిల్టప్‌ ద్వారా రూ. 5 వేల కోట్ల వరకు ఆదాయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆదాయ వనరులకు బీఆర్‌ఎస్‌ గండి కొడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా చేయాలనే తమ ప్రణాళికలను అడ్డుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓటమితో బీఆర్‌ఎస్‌కు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హిల్టప్‌ (హైదరాబాద్‌ పారిశ్రామిక భూముల బదిలీ విధానం’పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన విమర్శలను శ్రీధర్‌బాబు ఖండించారు. పెట్టుబడులు తెచ్చి ఉపాధి అవకాశాలు పెంచాలనే తమ ఉద్దేశాలను వక్రీకరిస్తూ కేటీఆర్‌ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. 

బీఆరెస్సే యాజమాన్య హక్కులు కల్పించింది
‘పారిశ్రామిక భూముల కన్వర్షన్‌ కోసం ఇంపాక్ట్‌ ఫీజు వసూలును రూ.5 లక్షల కోట్ల కుంభకోణంగా కేటీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారు. 9,292 ఎకరాల భూమిలో పరిశ్రమలకు 4,740 ఎకరాలు ప్లాటింగ్‌ చేసి కేటాయించగా, మిగిలిన భూమి రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించారు. ఈ భూములను పరిశ్రమల ఏర్పాటుకు అనేక దశాబ్దాలుగా కేటాయిస్తూ వచ్చారు.

ఆజామాబాద్, కూకట్‌పల్లి, హఫీజ్‌పేటలోని భూములకు ఫ్రీ హోల్డ్‌ పేరిట బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యాజమాన్య హక్కులు కలి్పంచింది. మేం ఇప్పుడు ఆ భూములకు కన్వర్షన్‌ అవకాశం కల్పిస్తున్నాం. 30, 50 శాతం శ్లాబులతో ఇంపాక్టు ఫీజు నిర్ణయిస్తూ ఈ నెల 17 న జరిగిన కేబినెట్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..’అని శ్రీధర్‌బాబు తెలిపారు.

మీరెన్ని లక్షల కోట్లు వెనకేసుకున్నారు? 
‘2023లో ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఫ్రీ హోల్డ్‌ హక్కులు కలి్పంచిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల లక్షల కోట్ల రూపాయలు వెనుకేసుకుందో చెప్పాలి. పరిశ్రమల యజమానులు హక్కులు పొందాలంటే రిజి్రస్టేషన్‌ విలువపై 100 శాతం చెల్లించాలని, అవి చేతులు మారితే 200 శాతం కట్టాలని జీఓలు ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ హయాంలో యాజమాన్య హక్కులు కలి్పంచిన వారికి భూ వినియోగ మారి్పడి చేసుకునే అవకాశం మాత్రమే మేం కలి్పంచాం. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, పరిశ్రమల కమిషనర్లు పరిశ్రమల సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట 30 శాతం, 50 శాతం శ్లాబులను ప్రతిపాదించారు..’అని మంత్రి వివరించారు.

యాజమాన్య హక్కులు లేకపోతే కుదరదు
‘ఇంపాక్ట్‌ చార్జీల వల్ల ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాం. హిల్టప్‌ విధానం ప్రకారం.. యాజమాన్య హక్కులు లేనివారు కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకోలేరు. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న పరిశ్రమలను వెలుపలకు తరలిస్తామని మొదటి నుంచి చెబుతున్నాం. గాలి, నీరు కలుíÙతం కాకుండా ఉండటానికి పరిశ్రమలను బయటకు తరలిస్తున్నాం. అయితే సీఎం సోదరులు అగ్రిమెంట్లు చేసుకున్నారంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు..’అని శ్రీధర్‌బాబు మండిపడ్డారు.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement