‘అప్పుడు అవహేళన చేశారు.. ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు’

Minister Kakani Govardhan Reddy Comments On Chandrababu - Sakshi

మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి

సాక్షి, నెల్లూరు జిల్లా: సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో నెల్లూరు కస్తూరిబా కళాక్షేత్రంలో ‘థ్యాంక్యూ సీఎం సార్‌’ ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
చదవండి: రాష్ట్రపతి ఎన్నిక; టీడీపీ డబుల్‌ గేమ్‌

ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ, జన్మభూమి కమిటీలతో పేదలను గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. ప్రపంచానికే సచివాలయ వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సచివాలయ వ్యవస్థను అవహేళన చేసినవారు ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారన్నారు. అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయని మంత్రి కాకాణి అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top