
చంద్రబాబు చాలా ఫ్రస్టేషన్లో ఉన్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు చాలా ఫ్రస్టేషన్లో ఉన్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎల్లో మీడియాను చూసుకుని బలుపుతో ప్రవర్తిసున్నారని దుయ్యబట్టారు. తండ్రీకొడుకులు తిరుగుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.
‘‘జగన్ ప్రతి ఇంటి ముద్దు బిడ్డ అని ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. పెత్తందార్లకు కొమ్ము కాసే వ్యాధి చంద్రబాబుకు పట్టింది. బాబుకు తన సొంత మనుషులకు ఆస్తులు కట్టబెట్టాలనే వ్యాధి వచ్చింది. ఈ వ్యాధులతోనే అమరావతి రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నాడు’’ అని చంద్రబాబుపై కన్నబాబు మండిపడ్డారు.
చదవండి: చింతమనేని ప్రభాకర్ వింత ప్రవర్తన.. ఐసీయూలోకి తోపుడు బండ్లు..