చింతమనేని ప్రభాకర్‌ వింత ప్రవర్తన.. ఐసీయూలోకి తోపుడు బండ్లు..

Chintamaneni Prabhakar Strange Behavior In Eluru Government Hospital - Sakshi

ఏలూరు టౌన్‌:  తన విపరీత ధోరణితో నిత్యం వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నించే ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో వందలాది మందితో లోనికి వెళ్లి వై­ద్య సేవలకు తీవ్ర అసౌకర్యం కలిగించారు.

ఐసీ­యూలోకి ఏకంగా తోపుడు బండ్లపై మా­మిడి పండ్లను తీసుకెళ్లి రోగులకు పంచే కార్యక్రమం చేపట్టడంతో సిబ్బంది, రోగుల బంధువులు ము­క్కున వేలేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని చింతమనేని తనదైన శైలిలో రెచ్చిపోయా­రు.

బ్యాక్టీరియా, వైరస్‌లు రాకుండా ప్రత్యే­క జాగ్రత్తలు పాటించే ఐసీ­యూ­లోకి తోపుడు బం­డ్లు తీసుకుని వెళ్లడంపై వైద్యులు అభ్యంత­రం వ్యక్తం చేస్తున్నారు. సేవా కార్యక్రమా­ల పే­రు­తో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు వేసుకుని మరీ ఆ­­స్పత్రిలో హడావుడి చేయడంపై వైద్యులు, రో­గుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ఇటు పునాది రాళ్లు-అటు సమాధి రాళ్లు
       

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top