పోలీసులపై జరిగిన దాడి పవన్‌కు కనిపించడం లేదా?: వెల్లంపల్లి | Ex Minister Vellampalli Srinivas Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

పోలీసులపై జరిగిన దాడి పవన్‌కు కనిపించడం లేదా?: వెల్లంపల్లి

Aug 6 2023 12:49 PM | Updated on Aug 6 2023 3:46 PM

Ex Minister Vellampalli Srinivas Fires On Chandrababu - Sakshi

రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు.

సాక్షి, విజయవాడ: రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. పుంగనూరులో టీడీపీ అరాచకాలను, పోలీసులపై దాడులను నిరసిస్తూ విజయవాడలో నిరసనలు తెలిపారు.  ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్‌ను అధికారం నుంచి దించలేమని చంద్రబాబు ప్లాన్‌​ చేశారు. రూట్‌ మ్యాప్‌ ప్రకారం కాకుండా పుంగనూరుకు వెళ్తానని చంద్రబాబు మొండికేయడంతో ఘర్షణ మొదలైందన్నారు.

‘‘లా అండ్‌ ఆర్డర్‌ కోసమే చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పోలీస్‌ వ్యాన్లు తగలపెట్టారు. 50 మంది పోలీసులను గాయపరిచారు. పోలీసులపై జరిగిన దాడి పవన్‌కు కనిపించడం లేదా? అధికారం కోసమే చంద్రబాబు హింసను పోత్సహిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడం చంద్రబాబు వల్ల కాదు’’ అని వెల్లంపల్లి స్పష్టం చేశారు.
చదవండి: పక్కా ‘ఎల్లో’ స్కెచ్‌.. ‘పచ్చ’ నేతల కనుసన్నల్లోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement