పార్టీ ఆఫీసులోకి వెళ్లనివ్వడం లేదు: ‘ఆప్‌’ నేతలు | Delhi Minister Athishi Fire On Centre Accuses AAP Office Seized, Details Inside - Sakshi
Sakshi News home page

పార్టీ ఆఫీసులోకి వెళ్లనివ్వడం లేదు: ‘ఆప్‌’ నేతలు

Mar 23 2024 2:13 PM | Updated on Mar 23 2024 3:44 PM

Delhi Minister Athishi Fire On Centre Accuses Aap Office Seized - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ తమ పార్టీ ఆఫీసును సీజ్‌ చేసి తమను లోపలికి వెళ్లకుండా చేశారని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) సీనియర్‌ నేత, ఢిల్లీ మంత్రి అతిషి మండిపడ్డారు. దీనిపై తాము ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.  ఈ మేరకు శనివారం ఎక్స్‌(ట్విటర్‌లో) ఆమె ఒక పోస్టు చేశారు.

ఢిల్లీ నడిబొడ్డున్న ఉన్న తమ పార్టీ ఆఫీసులోకి వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ఎన్నికల ముంగిట ప్రతిపక్షాలకు సమాన పోరాట వేదిక లేకుండా చేసే బీజేపీ కుట్రలో ఇది భాగమని ఫైర్‌  అయ్యారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధ చర్య అని పేర్కొన్నారు. లిక్కర్‌ స్కామ్‌  కేసులో ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి.. కేజ్రీవాల్‌ అరెస్టు.. జర్మనీ ప్రకటనపై భారత్‌ నిరసన 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement