మరో వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌ కూల్చివేతకు టీడీపీ కుట్ర.. బయటపడ్డ సంచలన ఆడియో | Conspiracy Of Chandrababu Govt To Demolish Another Ysrcp Office | Sakshi
Sakshi News home page

మరో వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌ కూల్చివేతకు టీడీపీ కుట్ర.. బయటపడ్డ సంచలన ఆడియో

Jun 23 2024 8:40 PM | Updated on Jun 23 2024 9:05 PM

Conspiracy Of Chandrababu Govt To Demolish Another Ysrcp Office

టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరో వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూల్చివేతకు కుట్రకు తెరతీశారు. సంచలన ఆడియో బయటపడింది.

సాక్షి, విజయవాడ: టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరో వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూల్చివేతకు కుట్రకు తెరతీశారు. సంచలన ఆడియో బయటపడింది. పాత తేదీలతో నోటీసులు ఇవ్వటానికి వస్తున్నట్టు కార్పొరేషన్‌ సిబ్బంది చెప్పిన ఆడియో వెలుగులోకి వచ్చింది.

ఇప్పటికే తాడేపల్లిలో నిర్మాణం పూర్తికావొచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసింది. తాజాగా విజయవాడ ఆఫీస్‌నీ కూల్చివేసేందుకు కుట్రలు చేస్తోంది. ఈ మేరకు కార్పొరేషన్‌ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. పాత తేదీ వేసి నోటీసులు జారీచేస్తామని, తీసుకోవాలంటూ పార్టీ ఆఫీసు నిర్మాణ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నారు.

కాగా, తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్‌డోజర్లతో కూల్చి వేసింది.

దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్‌ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్‌ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement