
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో జరిగే సభలో పాల్గొననున్నారు.
ఉదయం 10 గంటలకు బొబ్బిలి, మధ్యాహ్నం 12.30 గంటలకు పాయకరావుపేట, మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులో జరిగే ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.
కాగా, (ఈ రోజు) మంగళవారం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు, కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగిన బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు.