Sakshi TV: సాక్షి టీవీపై చంద్రబాబు అక్కసు

Chandrababu Comments On Sakshi TV In Kuppam

సాక్షి, చిత్తూరు జిల్లా: సాక్షి టీవీపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. సాక్షి టీవీనా.. వాడిని లాగి బయట పడేయండన్న చంద్రబాబు.. వారిది అమానుషం, బయట తిరగకుండా చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. కుప్పంలో పోలీసులపై కూడా చంద్రబాబు వీరంగం సృష్టించారు. పోలీసులపై ఆయన రెచ్చిపోయారు. మీ అంతు చూస్తానంటూ పోలీసులను బెదిరించారు. నిబంధనలు పాటించాల్సిందేనని బాబుకు పోలీసులు స్పష్టం చేయగా, ‘నాకే రూల్స్‌ చెబుతారా’ అంటూ పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వెళ్లగక్కారు.

కాగా, చంద్రబాబు కుప్పం పర్యటనలో ఓవరాక్షన్‌పై ఎమ్మెల్సీ భరత్‌ ఫైర్‌ అయ్యారు. టీడీపీ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. చంద్రబాబు ఫ్రస్టేషన్‌ పీక్స్‌కు వెళ్లింది. ఇటీవలే 11 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. మళ్లీ చంద్రబాబు ఏం చేద్దామని కుప్పం వచ్చారంటూ ప్రశ్నించారు. అమాయకుల మరణాలకు సంబంధించి పోలీసులపై నెపం నెట్టి ప్రజలను డైవర్ట్‌ చేయాలన్నదే బాబు ఉద్దేశం. పేద ప్రజల ప్రాణాలంటే చంద్రబాబు విలువలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: అందుకే ఆ జీవో తెచ్చాం: మంత్రి జోగి రమేష్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top