వంగర మండలం సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నాగుపాము కలకలం సృష్టించింది. ఆలయం గర్భగుడిలో ప్రధాన అర్చకుడు సిద్ధాంత గణపతి పూజలు
చేస్తున్న సమయంలో నాగుపాము దర్శనమిచ్చింది. వీటిని చూసిన భక్తులు బయటకు పరుగులు తీశారు. శివ సన్నిధిలో నాగుపాము దర్శనమివ్వడం, భక్తులు ఒకింత అదృష్టంగా భావించినప్పటికీ, భారీ నాగుపాము కావడంతో భక్తులు భయాందోళన చెందారు. అర్చకులు నాగుపామును సమీప తోటల్లోకి మళ్లించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. – వంగర


