న్యూస్రీల్
మంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026
విద్యార్థుల భవితతో..
●వీరఘట్టం ప్రభుత్వ జూనియర్
కళాశాలలో 324 మంది విద్యార్థులు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో చాలామంది హైస్కూల్ స్థాయిలో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొన్నవారే. ఇక్కడ వ్యాయామ అధ్యాపకుడు లేరు. ఆటల్లో తర్ఫీదునిచ్చేవారు కరువయ్యారు.
●పాలకొండలోని బాలికల జానియర్ కళాశాల్లో 360 మంది, బాలుర
జూనియర్ కళాశాల్లో 524 మంది
చదువుతున్నారు. వీరిలో పాఠశాల స్థాయిలో ఎన్నో క్రీడలు ఆడిన వారు ఉన్నారు. అయితే, ఇక్కడ కూడా పీడీ
(ఫిజికల్ డైరెక్టర్) పోస్టు ఖాళీగా ఉండడంతో
వీరంతా ఆటలకు దూరమయ్యారు.
నాకు అథ్లెటిక్స్ అంటే ఎంతో ఇష్టం. టెన్త్ చదువుతున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో 8 కి. మీ, 6 కి.మీ పరుగు పందెంలో పాల్గొని సత్తాచాటాను. ఇంటర్లో చేరిన తర్వాత పూర్తిగా ఆటలకు దూరమయ్యాను.
– వి.లీలాప్రసాద్, ఇంటర్ విద్యార్థి, వీరఘట్టం


