బరంపురం: గంజాం జిల్లాలోని గెలరి గ్రామంలో విద్యుత్ మీటర్ రీడర్ హత్యకు గురైన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఎస్పీ జగ్మాహన్ మినా తెలిపిన వివరాల మేరకు.. గెలరీ పోలీసుస్టేషన్ పరిధి కుడాలి ఆదివాసీ గ్రామంలో విద్యుత్ మీటర్ రీడింగ్ కోసం వెళ్లిన సౌత్ కో ఉద్యోగి లక్ష్మీ నారాయణ త్రిపాఠి హత్యకి గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని బంజనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Breadcrumb
- HOME
Related news
-
Soma Mondal: క్వీన్ ఆఫ్ స్టీల్
పెద్ద బాధ్యతను స్వీకరించినప్పుడు గర్వించదగిన క్షణాలు మాత్రమే ఉండవు. పెద్ద పెద్ద సవాళ్లు కాచుకొని కూర్చుంటాయి. భయపెడతాయి. ఆ సవాళ్లకు భయపడితే అపజయం మాత్రమే మిగులుతుంది. వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటే విజయం సొంతం అవుతుంది. ఇంజినీరింగ్ చదివే రోజుల నుంచి ఉక్కు పరిశ్రమలోకి అడుగు పెట్టే వరకు, ఉద్యోగ ప్రస్థానంలో రకరకాల సవాళ్లను ఎదుర్కొంది సోమా మండల్. వాటిని అధిగమించి అపురూపమైన విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా... ఫోర్బ్స్ ‘వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్– 2023’ జాబితాలో చోటు సంపాదించింది. భువనేశ్వర్లోని ఓ బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది సోమా మండల్. తండ్రి అగ్రికల్చర్ ఎకానమిస్ట్. అప్పట్లో చాలామంది తల్లిదండ్రుల ధోరణి ‘ఆడపిల్లలను ఒక స్థాయి వరకు చదివిస్తే చాలు. పెద్ద చదువు అక్కర్లేదు’ అన్నట్లుగా ఉండేది. సోమా తండ్రిలో మాత్రం అలాంటి భావన లేదు. ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను’ అనేవాడు. అలాంటి వ్యక్తి కాస్తా సోమా ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు ‘కుదరదు’ అని గట్టిగా చెప్పాడు. ఎందుకంటే ఆరోజుల్లో అమ్మాయిలు ఇంజినీరింగ్ చదవడం అరుదు. తల్లి సహాయంతో నాన్న మనసు మారేలా చేసింది. రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసింది. ఇక కాలేజీ రోజుల విషయానికి వస్తే బ్యాచ్లో రెండు వందల మంది ఉంటే ఇద్దరు మాత్రమే అమ్మాయిలు. పాఠం వింటున్నప్పుడు ఏదైనా సందేహం అడగాలంటే అబ్బాయిలు నవ్వుతారేమోనని భయపడేది. అయితే ఒకానొక సమయంలో మాత్రం... ‘అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే చదువు చదువుతున్నప్పుడు భయపడటం ఎందుకు?’ అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది... ఇక అప్పటి నుంచి ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఆ ధైర్యమే తన భవిష్యత్ విజయాలకు పునాదిగా నిలిచింది. సోమా మెటల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు మహిళా ఉద్యోగులు ఎక్కువగా లేరు. ‘మెటల్ ఇండస్ట్రీ అంటే పురుషుల ప్రపంచం’ అన్నట్లుగా ఉండేది. ఇక మహిళలు ఉన్నత స్థానాల్లోకి రావడం అనేది ఊహకు కూడా అందని విషయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ భవిష్యత్పై ఆశను కోల్పోలేదు సోమా మండల్. నాల్కో(నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్)లోకి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలి మహిళా డైరెక్టర్(కమర్షియల్) స్థాయికి చేరింది. 2017లో సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)లోకి వచ్చిన తరువాత ఫస్ట్ ఉమెన్ ఫంక్షనల్ డైరెక్టర్, ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెయిల్గా ప్రత్యేక గుర్తింపు పొందింది. సెయిల్ చైర్పర్సన్గా బా«ధ్యతలు స్వీకరించిన కాలంలో ఆ సంస్థ వేల కోట్ల అప్పులతో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో మార్పులు తీసుకువచ్చింది. మైక్రో–మేనేజ్మెంట్పై దృష్టి సారించింది. సెయిల్ ప్రాడక్ట్స్ను ప్రమోట్ చేయడానికి మార్గాలు అన్వేషించింది. గ్రామీణ ప్రాంతాలలో వర్క్షాప్లు నిర్వహించింది. కొత్త వ్యాపార వ్యూహాలను అనుసరించింది. సోమా కృషి వృథా పోలేదు. అప్పులు తగ్గించుకుంటూ ‘సెయిల్’ను లాభాల దిశగా నడిపించింది. ‘నా కెరీర్లో జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాలేదు. మహిళ అయినందుకు గర్వపడుతున్నాను. మన దేశంలో వివిధ రంగాలలో మహిళా నాయకుల సంఖ్య పెరుగుతోంది. లీడర్కు అసంతృప్తి ఉండకూడదు. ఆశాభావం ఉండాలి. పరిమిత వనరులు ఉన్నా సరే మంచి ఫలితం సాధించే సామర్థ్యం ఉండాలి’ అంటుంది సోమా మండల్. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చే సోమా మండల్ అటు వృత్తి జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లింది. ‘సక్సెస్కు షార్ట్కట్ అనేది లేదు. అంకితభావం, సమర్థత మాత్రమే మనల్ని విజయానికి దగ్గర చేçస్తాయి’ అంటుంది సోమా మండల్. -
Paital Gagan: బట్టల తాత వచ్చాడోచ్
ఒరిస్సాలో ఏదో ఒక ఉదయం ఏదో ఒక మారుమూల పల్లెలో వ్యాన్ ఆగుతుంది. దానిని చూసిన వెంటనే పిల్లల కళ్లల్లో వెలుగు. కటిక దారిద్య్రం వల్ల చలికాలమైనా వానాకాలమైనా ఒంటి నిండా బట్టలు లేని వారికి గగన్ బట్టలు పంచుతాడు. రిటైర్డ్ ఉద్యోగి అయిన పెయిటల్ గగన్ తన భార్యతో కలిసి ఊరూరా తిరిగి బట్టలు సేకరించి పంచుతాడు. పిల్లల పసినవ్వును ఆశీర్వాదంగా పొందుతాడు. సంఘటనలు అందరికీ ఎదురవుతుంటాయి. కొందరు స్పందిస్తారు. కొందరు స్పందించరు. కొందరు ఆ సంఘటనలతో తమ లక్ష్యాన్ని, కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. అలాంటి వారు ఆదర్శంగా నిలుస్తారు. పదేళ్ల క్రితం– భువనేశ్వర్లో చిన్న పోస్టల్ ఉద్యోగైన గగన్ పెయిటల్ ఇంటికి వెళుతున్నాడు. అతనికి వాణి విహార్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక దిక్కులేని మహిళ కనిపించింది. ఆమె చిరిగిన చీర కట్టుకుని ఉంది. గగన్ ఆమెను చూసి జాలిపడి హోటల్ నుంచి ఫుడ్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. కాని ఆమె ‘అన్నం వద్దు. ముందు ఒక చీర ఇవ్వండి’ అని ప్రాధేయపడింది. స్త్రీగా ఆమె అవస్థ గమనించిన గగన్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లి పాత చీర తెచ్చి ఇచ్చాడు. ‘దానిని అందుకుంటూ ఆమె ముఖంలో కనిపించిన సంతోషం అంతా ఇంతా కాదు. ఒంటికి తగిన బట్ట ఉంటేనే మనిషికి మర్యాద. అది లేని వారు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. వారి కోసం ఏదైనా చేయాలి అని నిశ్చయించుకున్నాను’ అంటాడు గగన్. ఉద్యోగంలో ఉండగా మొదలుపెట్టిన ఈ పనిని రిటైరయ్యాక కూడా కొనసాగిస్తున్నాడు. చిన్న ఉద్యోగి అయినా పోస్టాఫీసులో చిరుద్యోగిగా పని చేసి రిటైరైన గగన్ భువనేశ్వర్లో చకైసియాని ప్రాంతంలో నివసిస్తాడు. కొడుకు మృత్యుంజయ బలిగూడ అనే ఊళ్లో క్యాబ్ డ్రైవర్. కోడలు టీచర్గా పని చేస్తున్నది. ఇతర బాదరబందీలు లేని గగన్ తన భార్య అన్నపూర్ణకు తన ఆలోచన చెప్పాడు. ‘మనం అందరికీ కొత్త బట్టలు ఇవ్వలేం. అలాగని అన్నేసి పాత బట్టలూ ఉండవు. కాబట్టి సేకరించి పంచుదాం’ అన్నాడు. అన్నపూర్ణ అతనికి సహరించడానికి అంగీకరించింది. ఆ రోజు నుంచి గగన్ తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా భువనేశ్వర్లోని అపార్ట్మెంట్లకూ హౌసింగ్ కాలనీలకు తిరిగి వాడిన దుస్తులను సేకరిస్తాడు. అవసరమైతే కటక్ వంటి ఇతర పట్టణాలకు కూడా వెళతాడు. ‘పేదలకు పంచుతాం. మీరు ఉపయోగించక పడేసిన దుస్తులు ఇవ్వండి’ అంటే చాలామంది ఇస్తారు. వాటిని తీసుకొస్తాడు గగన్. సరి చేసి, ఇస్త్రీ చేసి ‘మనం బట్టలు పంచినా అవి సరిగ్గా ఉండాలి. మావారు తెచ్చిన బట్టలు ఏవైనా చిరిగి ఉంటే కుట్టి, ఇస్త్రీ చేసి, స్త్రీలవి, పురుషులవి, పిల్లలవి విడివిడిగా ప్యాక్ చేసి కొత్తవిగా కనిపించేలా చేస్తాను’ అంటుంది గగన్ భార్య అన్నపూర్ణ. వాళ్లుండేది చిన్న ఇల్లే అయినా ఒక గది ఖాళీ చేసి పూర్తిగా గోడౌన్గా వదిలారు. భార్యాభర్తలిద్దరూ డాబా మీదకు చేరి వాటిని విభజించి మూటలుగా కడతారు. ఆ తర్వాత గగన్ తీసుకెళ్లి పంచుతాడు. బట్టలు, బూట్లు, దోమతెరలు గగన్ ముఖ్యంగా చిన్నపిల్లల కోసం బట్టలు సేకరిస్తాడు. ఒడిసాలో గిరిజన పిల్లలకు సరైన బట్టలు ఉండవు. కొండ ప్రాంతాలకు వెళ్లి వారి బాగోగులు ఎవరూ చూడరు. గగన్ అలాంటి పిల్లల కోసం బట్టలు సేకరించి పంచుతాడు. గగన్ సేవా భావం గమనించిన దాతలు అతనికో వ్యాన్ ఏర్పాటు చేశారు. గగన్కు ఏనుగంత బలం వచ్చింది. తాను సేకరించిన బట్టలను వ్యాన్లో వేసుకుని మారుమూల పల్లెలకు వెళ్లి పిల్లలకు పంచుతాడు. దోమలు కుట్టి పసికందులు రోగాల బారిన పడకుండా దోమతెరలు పంచుతాడు. బొమ్మలు ఇస్తాడు. పిల్లలు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తారు. బట్టల తాత అని పిలుస్తారు. పండుగల ముందు ఒడిసాలో చేసుకునే పండగల ముందు చాలా శ్రమించి బట్టలు సేకరిస్తాడు గగన్. పేదలు పండగ సమయంలో వీలైనంత మంచి బట్టలు వేసుకోవాలని ఆ సమయాలలో ప్రత్యేకంగా తీసుకెళ్లి పంచుతాడు. అంతేకాదు పూరి జగన్నాథ రథ యాత్ర సమయంలోనూ, కటక్ దుర్గా పూజకూ ఎక్కడెక్కడి పేదవారో వస్తారు. అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టి మరీ పాత బట్టలు పంచుతాడు. ఈ దేశంలో ప్రతి పేదవాళ్లకి ఒంటినిండా బట్ట దొరికే దాకా గగన్ లాంటి వాళ్లు వందలుగా పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారుగా ఎవరైనా ఉండొచ్చు. ప్రయత్నించాలి... కొద్దిగా మనసు పెట్టాలి అంతే. -
వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
భువనేశ్వర్: రూర్కెలా–పూరి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మెరామండలి, బుద్ధపంక్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లోని ఒక కిటికీ రాళ్ల తాకిడికి దెబ్బతిందని తెలిపింది. -
20 తులాల బంగారం, కేజీన్నర వెండి అపహరణ
చీపురుపల్లి: చాలాకాలం తరువాత పట్టణంలో దొంగల అలజడితో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ఒకే రాత్రి సమీప ప్రాంతాల్లోని రెండు నివాసాల్లోకి చొరబడిన దుండగులు స్థానికులను భయాందోళనకు గురిచేశారు. ఒక ఇంటిలో ఎలాంటి సొత్తు లభించకపోవడంతో వెళ్లిపోయిన దుండగులు మరో ఇంట్లో 20 తులాల బంగారం, కేజీన్నర వెండి చోరీకి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా చోరీకి పాల్పడిన దుండగులు ఒక ఇంటిలో డైనింగ్ టేబుల్పై ఉన్న జీడిపప్పు, మరో ఇంట్లో ఫ్రిజ్లో ఉన్న పాయసం తీసుకుని తిన్నారు. ఇదే తరహాలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల చోరీలు జరుగుతున్న నేపథ్యంలో తర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓ ముఠా వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చోరీలకు గురైన ఇళ్లను డీఎస్పీ ఏఎస్.చక్రవర్తి, సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్.ఉపేంద్ర, ఎస్సై ఎ.సన్యాశినాయుడు సోమవారం పరిశీలించారు. అంతేకాకుండా క్లూస్ టీమ్లను రప్పించి చోరీ జరిగిన ఇళ్లలో దుండగుల వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. చోరీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 20 తులాల బంగారం, కేజీన్నర వెండి అపహరణ పట్టణంలోని ఆంజనేయపురంలో గల విజయకృష్ణ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆప్టికల్స్ వ్యాపారి తమినాన గంగాధర్ కుటుంబంతో కలిసి ఆదివారం మధ్యాహ్నం శ్రీకాకుళంలోని అత్తవారి ఇంటికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు ఆదివారం రాత్రి ఇంటికి వెనుక వైపు ఉన్న కిటికీ గ్రిల్ డోర్ను తొలగించి ఇంటిలోకి చొరబడ్డారు. మాస్టర్ బెడ్రూంలో ఉన్న బీరువా తాళాలు విరగ్గొట్టి వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు. అనంతరం బీరువాలో ఉన్న 20 తులాల బంగారం, కేజీన్నర వెండి అపహరించుకుపోయారు. అంతేకాకుండా ఫ్రిజ్లో ఉన్న పాయసం తీసుకుని చక్కగా తిన్నారు. సోమవారం ఉదయం అపార్ట్మెంట్లో ఉన్న నివాసితులు కిటికీ తొలగించి ఉండడాన్ని గమనించి బాధితుడు గంగాధర్తో బాటు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎంతో కాలంగా కష్టపడి సంపాదించుకున్న బంగారం ఒకేసారి చోరీకి గురవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు వెంకటేశ్వరనగర్లో నివాసం ఉంటున్న ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగి దేముడు నివాసం వెనుక ద్వారం తాళాలు పగలగొట్టి చొరబడిన దుండగులు చిల్డ్రన్స్ బెడ్రూంలోకి ప్రవేశించి కబ్బోర్డుల్లో ఉన్న బట్టలు, వస్తువులు చిందరవందరగా పడేశారు. దేవుడి గదిలోకి వెళ్లి వస్తువులను చెల్లాచెదురు చేశారు. తరువాత హాలులో డైనింగ్ టేబుల్పై ఉన్న జీడిపప్పు తిన్నారు. అంతలో మాస్టర్ బెడ్రూంలో పడుకున్న దేముడు భార్య లేచిన శబ్దం రావడంతో దొంగలు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ చోరీకి సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
స్కానింగ్లకు వేలల్లో ఫీజులు
గంట్యాడ మండలానికి చెందిన బి.శ్రీనివాస్ తలనొప్పి అని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడంతో వైద్యుడు ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ చేయించాలని చీటీ రాసి ఇచ్చాడు. దీంతో ఆ వ్యక్తి ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో రూ.4 చెల్లించి స్కానింగ్ తీయించుకున్నాడు. ● ఇదే మండలానికి చెందిన ఆర్. అప్పారావు కాలి బొటన వేలు ఇన్ఫెక్షన్ అవడంతో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా బొటన వేలు తొలగించడానికి రూ.40 వేలు బిల్లు వేశారు. ● రెండు రోజుల పాటు జ్వరం రావడంతో విజయనగరానికి చెందిన మురళి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షలు రాశారు. వైద్య పరీక్షలన్నింటికీ రూ.1,000 బిల్లు అయింది. ● ఇలా ఈ ముగ్గురికే కాదు అనేక మంది రోగులకు నిత్యం ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబొరేటరీల్లో ఎదురువుతున్న పరిస్థితి ఇది. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబొరేటరీలు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా స్కానింగ్, వైద్య పరీక్షలు రాసి ప్రజల నుంచి దోపిడీకి పాల్పడుతున్నాయి. వైద్యులు రాస్తున్న పరీక్షలు, స్కానింగ్ చేయించుకోకపోతే ఏమోవుతుందోనని భయంతో వేలల్లో ఫీజులు చెల్లించి రోగులు చేయించుకుంటున్నారు. జ్వరం అని చెబితే చాలు వైద్యపరీక్ష జ్వరం అని ఎవరైనా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగానే వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. సాధారణ జ్వరానికి కూడా వైరల్, డెంగీ, మలేరియా, సీబీసీ, హెచ్బీ ఇలా అనేక రకాల వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. దీంతో రోగులకు తడిసి మోపుడువుతోంది. స్కానింగ్లకు వేలల్లో ఫీజులు సిటిస్కాన్, ఎంఆర్ఐ స్కాన్లకు అయితే వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అయితే రోగికి కచ్చితంగా అవసరమని వైద్యులు నిర్ధారిస్తే ఉచితంగా తీస్తారు. కానీ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో మాత్రం సిటిస్కాన్కు రూ.2500 నుంచి రూ. 3 వేలు, ఎంఆర్ఐ స్కాన్కు అయితే రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అవుతుంది. చాలా మంది ప్రైవేట్ వైద్యులకు ఆయా స్కానింగ్ సెంటర్లలో షేర్ ఉంటుంది. షేర్ లేని వైద్యులకు ఆ సెంటర్లు కమీషన్ ఆఫర్ చేస్తాయి. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు స్కానింగ్లు రాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్ఎంపీలే మధ్యవర్తులు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబొరేటరీలకు ఆర్ఎంపీలే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. కేసును బట్టి వారికి ఆయా ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలు కొంతమంది స్థానికంగా ఉంటున్న ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందుతున్నప్పటికీ, రోగులను వారు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలని సిఫార్సు చేస్తున్నారు. జిల్లాలో ఆస్పత్రుల వివరాలు : జిల్లాలో 79 క్లినిక్లు, 122 ప్రైవేటు నర్సింగ్ హోమ్లు ఉన్నాయి. 58 ల్యాబొరేటరీలు, 83 ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఆయా ఆస్పత్రులకు రోజుకు 10 వేల నుంచి 12 వేల మంది రోగులు వెళ్తున్నారు. వారిలో ఇన్పేషేంట్లుగా 1000 నుంచి 2 వేల మంది వరకు చేరుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో వేలాది మందికి వైద్య పరీక్షలు రాస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ లేకుండానే ల్యాబ్ల నిర్వహణ జిల్లాలో 58 ల్యాబొరేటరీలు మాత్రమే వైద్య ఆరోగ్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ లేకుండా 100 వరకు జిల్లాలో ల్యాబొరేటరీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వైరల్ జ్వరాలు, డెంగీ జ్వరాల వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో ల్యాబొరేటరీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఏ ల్యాబొరేటరీలో కూడ ఏ వైద్య పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తారో తెలిపే బోర్డు ఉండదు. దీంతో వారు ఎంత అడిగితే అంత ఇవ్వవలసిన పరిస్థితి. ల్యాబొరేటరీల్లో కానరాని పెథాలజిస్టులు జిల్లాలో ఉన్న ల్యాబొరేటరీల్లో పెథాలజిస్టులు కానరావడం లేదు. నిబంధన ప్రకారం యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్ , ప్లేట్లెట్ కౌంట్ వంటి పరీక్షలు పెథాలజిస్టుల పర్యవేక్షణ జరగాలి. ఒకటి, రెండు ల్యాబొరేటరీల్లో తప్ప మిగతా చోట వారు కనిపించరు.
Related News by category
-
మహిళాభివృద్ధే బీజేడీ లక్ష్యం
రాయగడ: రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సాహించి, అభివృద్ధిలో వారిని అగ్రస్థానంలో నిలపడమే బీజేడీ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, రాయగడ జిల్లా ఎన్నికల పరిశీలకుడు అతున్ సవ్యసాచి నాయక్ అన్నారు. స్థానిక తేజస్వీ హోటల్ మైదానంలో కొత్తగా నిర్మించిన బీజేడీ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ముందుగా స్థానిక కొత్త బస్టాండ్ వద్ద దివంగత ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన భారీ బైకు ర్యాలీలో పాల్గొన్నారు. బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాయగడ శాసనసభ నుంచి పోటీ చేస్తున్న అనసూయా మాఝి, కొరాపుట్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కౌలస్య హికకలు ర్యాలీలో పాల్గొన్నారు. కొత్త బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ మార్కెట్ మీదుగా ఫ్లైవర్ బ్రిడ్జి నుంచి తేజస్వీ ైమెదానం వరకు కొనసాగింది. వేల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ● మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో అతున్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలియజేశారు. మహిళల ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి స్వయం సహాయక బృందాలు, మిషన్ శక్తి వంటి పథకాలను బీజేడీ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. గడిచిన రెండు దశాబ్ధాలుగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న బీజేడీ ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. రాయగడ శాసనసభ, కొరాపుట్ లోక్సభ వంటి స్థానాల్లో మహిళలకు టిక్కెట్టు ఇచ్చి ఎన్నికల బరిలో నిలబెట్టిన నవీన్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోవచ్చని వివరించారు. ● ఆశీర్వదించండి ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రప్రథమంగా రాయగడ శాసనసభ నుంచి, అదేవిధంగా కొరాపుట్ లోక్సభ నుంచి మహిళలు పోటీ చేస్తున్నారు. దీంతో ప్రజల ఆశీర్వాదంతో తాము ముందుకు వెళ్లి అభివృద్ధికి కృషి చేస్తామని అనసూయా మాఝి, కౌసల్య హికకలు వేదికపై నుంచి అభ్యర్థిచారు. కార్యకర్తల సహకారం ఉంటే తమ విజయం సునాయాసమవుతుందన్నారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు. ● బీజేడీలో చేరికలు ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకుడు, ప్రముఖ న్యాయవాది బాబు రాజ్గురు, అతని మద్దతుదారులు బీజేడీ తీర్ధం పుచ్చుకున్నారు. మంత్రి నాయక్ వారికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జితు పూజారి, దయానిధి కొంధొపాణి, నందు మండంగి, విశ్వనాథ్ పిడిక, కృష్ణ సరక, శాంత గౌరి పూజారి వంటి కాంగ్రెస్ యువ నాయకులు బీజేడీలో చేరినవారిలో ఉన్నారు. మంత్రి సవ్యసాచి నాయక్ రాయగడలో భారీ బైక్ ర్యాలీ -
శనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024
● ఓటెత్తాలిఓటుహక్కు వినియోగంపై జిల్లా యంత్రాంగం విరివిగా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 85 శాతంకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించే విధంగా ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో జిల్లాలోని గుడారిలో శుక్రవారం ఓటుహక్కు వినియోగంపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. గుడారి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల్లో చైతన్యం కల్పించేవిధంగా సిబ్బంది బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. – రాయగడన్యూస్రీల్ -
విజృంభిస్తున్న మలేరియా వ్యాధి
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్, మునిగుడ సమితి పరిధి నియమగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న డొంగిరియా గ్రామాల్లో మలేరియా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంత ప్రజలు జ్వరాల బారినపడి మంచం పట్టడంతో సమాచారం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం ఈ మేరకు స్పందించింది. మలేరియా వ్యాధి సోకిన గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో వైద్య బృందాలు ఆయా ప్రాంతాలకు వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ రెండు సమితుల్లోని పార్శలి, లిఖాపొదొరొ, పొట్టంగపొదిరొ, డొంగామటి, జురప, లంబ, ఖాంబేసు, పొలొభెరి గ్రామాలకు వైద్య బృందాలు వెళ్లి చికిత్స అందిస్తున్నాయి. అదేవిధంగా రోగ నిర్ధారణ కోసం రక్త నమూనాలను సేకరిస్తున్నారు. అయితే కొంతమంది డొంగిరియా ప్రజలు కొండ ప్రాంతాల్లో నివసిస్తుండడంతో వారికి అందుబాటులో ఉన్న నాటువైద్యంపై ఆధారపడుతున్నట్లు తెలిసింది. అయితే అందరికీ సకాలంలో వైద్యం అందించే విషయంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వైద్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందని పేర్కొంది. -
నందన్కానన్ జూలో తెల్లపులి మృతి
భువనేశ్వర్: నగర శివారులోని బారంగ్ నందన్కానన్ జూలాజికల్ పార్క్లో 14 ఏళ్ల తెల్లపులి ‘స్నేహ’ శుక్రవారం జూలో చికిత్స పొందుతూ మరణించింది. గురువారం అస్వస్థతకు గురవ్వడంతో సత్వర చికిత్స ప్రారంభించారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న తరుణంలో తీవ్రమైన వడగాలుల కారణంగా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. స్నేహ 2010 మార్చి 1న జన్మించింది. 14 ఏళ్ల జీవిత కాలంలో 3 ఈతల్లో 9 పిల్లల తల్లిగా జూలో పులుల సంతతి వృద్ధికి తోడ్పడింది. వీటిలో 3 తెలుపు, 4 సాధారణ, 2 మెలనిస్టిక్ వన్నెల పులులు ఉండడం విశేషం. 2022 అక్టోబర్లో 11 ఏళ్ల తెల్లపులి బిజయ మృతి చెందింది. ఊపిరితిత్తుల క్యాన్సర్కు గురై ఇది మరణించింది. అంతకుముందు 2019 అక్టోబర్లో కాలేయ సంబంధిత అనారోగ్యంతో సుభ్రాంశు అనే ఐదేళ్ల తెల్ల మగ పులి కూడా మరణించింది. నందన్కానన్ అధికారిక వనరుల సమాచారం ప్రకారం ప్రస్తుతం జూలో 27 పులులు ఉన్నాయి. వీటిలో సాధారణ పులులతో 7 తెలుపు మరియు 3 మెలనిస్టిక్ పులులు ఉన్నాయి.మావో డంప్ స్వాధీనం మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి బోడిగేట్ట అడవిలో కూంబింగ్ నిర్వహించిన కోబ్రా, బీఎస్ఎఫ్ జవాన్లు మావోలు అమర్చిన భారీ డంప్ను వెలికితీశారు. వివరాల్లోకి వెళ్తే.. బేజాంగ్వాడ అడవిలో మావోల డంప్లు ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా జిల్లా ఎస్పీ నితీష్ వాద్వానికి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో కోబ్రా, బీఎస్ఎఫ్ జవాన్లు ముమ్మరంగా గురువారం సాయంత్రం నుంచి కూంబింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఎలక్కనూర్ గ్రామం వద్ద డంప్ను స్వాధీనం చేసుకున్నారు. డంప్లో ఒక ఐఈడీ టిఫిన్ బాక్స్ బాంబ్, ఆరు గన్లు, 36 హైడ్ గ్రానేట్స్, రెండు సోలార్ ఎల్క్ట్రికల్ ప్యానెల్స్, ఒక గ్యాస్ సిలిండర్, 20 మీటర్ల కరెంట్ వైరు ఉన్నట్లు వెల్లడించారు. డంప్ స్వాధీనం చేసుకున్న జవాన్లను అధికారులు అభినందించారు. నలుగురు దోపిడీ దొంగలు అరెస్టు బరంపురం: నగర శివారులోని శ్రీక్షేత్ర విహార్ పక్కన పడియాలో దోపిడీకి సిద్ధమవుతున్న ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. ఐఐసీ అధికారి గోపినాథ్ ప్రధాన్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్థరాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో నిమ్మఖండి పోలీసుస్టేషన్ పరిధిలో అర్థరాత్రి దోపిడీకి సిద్ధమవుతున్న ముఠా పోలీసుల కంటపడింది. దీంతో పోలీసులు వీరిని వెంబడించి చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో గంజాం జిల్లాలోని గంగపూర్ గ్రామానికి చెందిన తపన్ సాహు, పద్మపూర్ గ్రామానికి చెందిన నిమోయ్ చరణ్ నాయక్, తెంతులిఖండి గ్రామానికి చెందిన దేబనంద గౌడ, అస్కాకి చెందిన కె.సుర్యారావులు ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 2 బైక్లు, తుపాకీ, 5 గుండ్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.బీజేడీలోకి చేరికలు పర్లాకిమిడి: గుమ్మా సమితి సభ్యులు బర్నింగ్ గొమాంగో, గుసాని సమితిలో ఎం.ఎస్.పూర్ పోలాకి విష్ణుప్రసాద్లు శుక్రవారం బీజేడీలో చేరారు. స్థానిక బీజేడీ పార్టీ కార్యాలయంలో మిశ్రణ్ పర్వ్ శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కెంగం సూర్యారావు కాంగ్రెస్ నుంచి బీజేడీలో చేరిన బర్నింగ్ గొమాంగో, విష్ణుప్రసాద్లను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీజేడీ పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్లినవారు పార్టీ ఽద్రోహులని బీజేడీ ఛత్ర విభాగం అధ్యక్షుడు సుర్జిత్ త్రిపాఠి అన్నారు. -
‘రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం’
బరంపురం: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీజేపీ బరంపురం లోక్సభ అభ్యర్థి డా.ప్రదీప్ పాణిగ్రాహి ఆరోపించారు. స్థానిక పాత బస్టాండ్లోని నందన్ ఇంటర్నేషనల్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఒడిస్సా రాష్ట్ర అభివృద్ధికి విడుదల చేస్తున్న నిధులను అధికార పార్టీ బీజేడీ దారి మళ్లిస్తూ అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించి వివిధ రకాల పథకాల కింద కోట్లాది రూపాయులు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. అధికార బీజేడీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజలు ఇప్పటికే గ్రహించారని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి బుద్ధి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుభాష్ పాఢి, ఎమ్మెల్యే అభ్యర్థి కె.అనిల్ కుమార్, సునీల్ సాహు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement