స్కూటీలో చెలరేగిన మంటలు | - | Sakshi
Sakshi News home page

స్కూటీలో చెలరేగిన మంటలు

Jul 12 2023 10:02 AM | Updated on Jul 12 2023 10:08 AM

 స్కూటీ నుంచి ఎగిసిపడుతున్న మంటల  - Sakshi

స్కూటీ నుంచి ఎగిసిపడుతున్న మంటల

రన్నింగ్‌లో ఉన్న స్కూటీలో మంటలు చెలరేగిన ఘటన

కర్ణాటక: రన్నింగ్‌లో ఉన్న స్కూటీలో మంటలు చెలరేగిన ఘటన బొరిగుమ్మ సమితి అవుంలి కూడలి వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒక ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో నవరంగపూర్‌ ఆర్‌కే కాలనీకి చెందిన అశోక్‌ సాహు పనిచేస్తున్నాడు. సోమవారం తన స్కూటీపై నవరంగపూర్‌ నుంచి బొరిగుమ్మ మీదుగా జయపురం బయల్దేరాడు. అతడు నవరంగపూర్‌ – బొరిగుమ్మ 26వ జాతీయ రహదారిలో బొరిగుమ్మ సమితి అవుంలి కూడలి వద్దకు వచ్చే సమయానికి స్కూటీ ఇంజన్‌ నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అవుంలి జంక్షన్‌లో ఉన్నవారు గమనించి అశోక్‌ను బండి ఆపమని అప్రమత్తం చేశారు.

అశోక్‌ బండి ఆపి దిగేసరికి ఒక్కసారిగా స్కూటీ అంతా మంటలు వ్యాపించి ఎగిసిపడ్డాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక విభాగానికి సమాచారం తెలియజేసినా, వాళ్లు వచ్చేటప్పటికే బండి పూర్తిగా దగ్ధమయ్యింది. అశోక్‌ రెండు నెలల క్రితమే స్కూటీ కొన్నట్లు తెలుస్తోంది. షార్ట్‌ సర్క్యూట్‌ వలనే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పెట్రోలు వాహనం కావడంతో వేగవంతంగా మంటలు వ్యాపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement