న్యూస్రీల్
విద్యార్థులను మానసికంగా బలవంతులను చేయాలి.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరూ ఆ బాధ్యత తీసుకోవాలి. విద్యా రంగంలో ఒత్తిడిని తగ్గించాలి. విద్యార్థులపై తలకు మించిన భారం పెట్టకూడదు. నిబంధనల ప్రక్రారం వెయ్యి మంది, అంతకన్నా ఎక్కువగా ఉన్న ప్రతి విద్యా సంస్థలోనూ కౌన్సెలింగ్ చేయటానికి సైకాలజిస్ట్ ఉండాలి.
–డాక్టర్ బి.ప్రసాద్బాబు, రీజనల్
డైరెక్టర్, సైకాలజిస్ట్, ఇగ్నో విజయవాడ
మార్కులు, ర్యాంకులే కొలమానాలుగా ఉన్న నేటి విద్యా వ్యవస్థ చిన్నారులు, విద్యార్థుల జీవితాలను బలి తీసుకుంటోంది. తల్లిదండ్రులు తమ ఆలోచనలను, ఆకాంక్షలను పిల్లల మీద బలవంతంగా రుద్దు తున్నారు. పెద్దలు తమ మీద పెట్టుకున్న ఆశలను నెరవేర్చలేకపోతున్నామన్న మానసిక క్షోభతో పిల్లలు క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడు తున్నారు. ఈ పాపంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరూ భాగస్వాములేనని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.


