కొండగట్టులో బందోబస్తును పర్యవేక్షించిన సీపీ
నిజామాబాద్అర్బన్: జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రానికి శనివారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అక్కడ బందోబస్తు పర్యవేక్షించారు. ఈ బందోబస్తులో జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, సిరిసిల్ల ఎస్పీ మహేష్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మంచిర్యాల డీసీపీ భాస్కర్. నిజామాబాద్ అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఈ బందోబస్తును పర్యవేక్షించారు. నిజామాబాద్ జిల్లా పోలీసులు కూడా పాల్గొన్నారు.


