నిర్మల్ టౌన్: హైదరాబాద్లో ఈనెల 21 నుంచి 23 వరకు జరిగిన 18వ మాన్సూన్ ట్రైనింగ్ క్యాంప్లో నిర్మల్ జిల్లా కరాటే మాస్టర్స్ ప్రత్యేక శిక్షణ పొందారు. జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన శిబిరంలో జపాన్కు చెందిన ప్రముఖ మాస్టర్స్ తనియామా, వై.హకిజుమే ఆధునిక కిహాన్ టెక్నిక్స్, కటాస్తోపాటు పలు సాంకేతిక అంశాలపై శిక్షణ ఇచ్చారు. జిల్లా కరాటే మాస్టర్స్ కొండాజీ శ్రీకాంత్, భూషణ్, మృణాలిని, మనీషా, శరణ్య, నితిన్, జ్ఞానతేజ తదితరులు పాల్గొన్నారు.


