సారంగపూర్: మండలంలోని మహబూబ్ఘాట్స్పై వాచ్టవర్ వెనుకవైపు ప్రమాదకర జలపాతం వద్దకు ఎవరూ వెళ్లొద్దని జిల్లా అటవీశాఖధికారి సుషాంత్ పుఖ్దేవ్ బోబడే అన్నారు. శనివావరం జలపాతాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం పడిన ప్రతీసారి ఈజలపాతం వద్దకు పర్యాటకుల భారీగా వస్తున్నారన్నారు. ఇక్కడికి చేరుకునేందుకు సరైన మార్గం లేదని తెలిపారు. ఈప్రదేశం మొత్తం భారీ వర్షాల కారణంగా అత్యంత ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. వర్షం పడిన సమయంలో ప్రవాహం పెరిగి ప్రమాదాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయన వెంట డీఆర్ఏ నజీర్ఖాన్, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు.


