చెన్నైలో వందే భారత్‌ స్లీపర్‌ ఆవిష్కరణ | Vande Bharat Sleeper launch in Chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో వందే భారత్‌ స్లీపర్‌ ఆవిష్కరణ

Oct 24 2024 5:46 AM | Updated on Oct 24 2024 5:46 AM

Vande Bharat Sleeper launch in Chennai

సాక్షి, చెన్నై: వందే భారత్‌ స్లీపర్‌ వెర్షన్‌ రైలును చెన్నై ఐసీఎఫ్‌లో బుధవారం ఆవిష్కరించారు. ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) జనరల్‌ మేనేజర్‌  సుబ్బారావు ఈ రైలు గురించి మీడియాకు తెలిపారు. చెన్నైలోని ఐసీఎఫ్‌లో వందే భారత్‌ రైళ్ల తయారీ జరుగుతోందని చెప్పారు. దీంతోపాటు వందే మెట్రో రైళ్లు, అమృత్‌ వందే మెట్రో రైళ్లు కూడా తయారు చేస్తున్నామన్నారు. 

అదే సమయంలో స్లీపర్‌ సౌకర్యాలతో కూడిన వందే భారత్‌ రైళ్లను సిద్ధం చేసి రాత్రి వేళల్లో నడపాలని రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా స్లీపర్‌ వెర్షన్‌ అన్ని హంగులతో రూపుదిద్దుకుందని వివరించారు. త్వరలో ట్రయల్‌ రన్‌ నిర్వహించి పట్టా లెక్కించబోతున్నట్లు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement