మరో నాలుగేళ్లు ఫోర్టీఫైడ్‌ రైస్‌ | Union Cabinet okays fortified rice supply under welfare schemes till 2028 | Sakshi
Sakshi News home page

మరో నాలుగేళ్లు ఫోర్టీఫైడ్‌ రైస్‌

Oct 10 2024 5:57 AM | Updated on Oct 10 2024 5:57 AM

Union Cabinet okays fortified rice supply under welfare schemes till 2028

2028 వరకు వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఉచిత సరఫరా 

ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరో నాలుగేళ్ల పాటు ఉచిత ఫోర్టీఫైడ్‌ రైస్‌ అందించనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా 2028 డిసెంబర్‌ వరకు ఉచిత ఫోర్టిఫైడ్‌ రైస్‌ సరఫరా కొనసాగింపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. సూక్షపోషకాలైన ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ బి12లను బియ్యానికి జోడిస్తారు. దీన్నే ఫోర్టీఫైడ్‌ రైస్‌గా పిలుస్తారు. 2024 జూలై నుంచి 2028 డిసెంబర్‌ వరకు ఈ కార్యక్రమం అమలు కోసం రూ.17,082 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఫోర్టీఫైడ్‌ రైస్‌ ఉచిత సరఫరాను కొనసాగించడంతో పాటు పలు అంశాలకు ఆమోదముద్ర వేశారు. గుజరాత్‌లో ని లోథాల్‌లో జాతీ య మారిటైమ్‌ హెరిటేజ్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎంహెచ్‌సీ)ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎన్‌ఎంహెచ్‌సీ అభివృద్ధిలో 22 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది. ‘ఫేజ్‌ 1ఎ’లో జాతీయ మారిటైమ్‌ హెరిటేజ్‌ మ్యూజియం, ఆరు గ్యాలరీలు ఉంటాయని వివరించింది. భారత నావికాదళం, తీరప్రాంత రక్షకదళం గ్యాలరీలు ఉంటాయని, దేశంలోనే అతిపెద్దవిగా ఇవి నిలుస్తాయని తెలిపింది. ఫేజ్‌–2లో తీరప్రాంత రాష్ట్రాల పెవిలియన్‌లు, మారిటైమ్‌ ఇనిస్టిట్యూట్, హాస్టల్, నాలుగు థీమ్‌ బేస్డ్‌ పార్క్‌లను ఏర్పాటు చేస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement