TN: అన్నాడీఎంకే కార్యకర్త హత్య | Unidentified People Killed Aia Dmk Worker In Tamilnadu | Sakshi
Sakshi News home page

TN: అన్నాడీఎంకే కార్యకర్త హత్య

Jul 28 2024 2:48 PM | Updated on Jul 28 2024 3:30 PM

Unidentified People Killed Aia Dmk Worker In Tamilnadu

చెన్నై: తమిళనాడులోని కడలూర్‌ జిల్లాలో ఆదివారం(జులై 28) అన్నాడీఎంకే కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తిని తిరుపాప్లియూర్‌కు చెందిన పద్మనాభన్‌గా గుర్తించారు. ఇతడు ఓ షాపు నడుపుతూ జీవనం సాగిస్తూ అన్నాడీఎంకే పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 

బాగూర్‌​ గ్రామానికి బైక్‌పై వెళుతుండగా పద్మనాభన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తమ వాహనంతో వేగంగా ఢీకొట్టారు. దీంతో పద్మనాభన్‌ మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన పద్మనాభన్‌పై గతంలో హత్యకేసు ఉండటం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement