థాయిలాండ్లో ఘోర ప్రమాదం
31 మంది ప్రయాణికుల దుర్మరణం
నఖోన్ రాచసీమ(థాయిలాండ్): థాయిలాండ్లో హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ కోసం తెప్పించిన భారీ క్రేన్ అటుగా వెళ్తున్న రైలు ప్రయాణికులకు పెనుశాపంగా పరిణమించింది. అత్యంత వేగంగా వెళ్తున్న రైలు మీద భారీ క్రేన్ పడటంతో బోగీలు పట్టాలు తప్పి, అగి్నకీలలు వ్యాపించిన ఘోర ప్రమాదంలో 31 మంది ప్రయాణికులుప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
విష యం తెల్సుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నంచేశారు. సహాయక సిబ్బంది వెంటనే క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. చైనా, ఆగ్నేయాసియా ప్రాంతాలను అనుసంధానించే లక్ష్యంతో ఈ హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ను చేపట్టారు. బ్యాంకాక్ నుంచి ఉమాన్ రాచసమీ ప్రావిన్స్కు బుధవారం ఉదయం బయల్దేరిన రైలుపై మార్గ మధ్యంలో నఖోన్ సిఖియో జిల్లా పరిధిలో భారీ క్రేన్ పడటంతో ఈ పెను ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న రైలుపై నిర్మాణరంగ క్రేన్ పడటంతో బోగీలు పట్టాలు తప్పి ధ్వంసమయ్యాయి.
వెనువెంటనే బోగీల నుంచి మంటలు చెలరేగాయి. ఇంకా నలుగురి జాడ తెలియాల్సి ఉందని, బోగీల శిథిలాల కింద చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం అన్వేషణ కొనసాగుతోందని నఖోన్ రాచసీమ గవర్నర్ అనుఫోంగ్ సుక్సోమ్నిత్ చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు రైలులో 171 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. రైలు పట్టాలకు ఇరువైపులా దూరంగా రెండు కాంక్రీట్ సపోర్ట్ పిల్లర్ల మీదుగా గిర్డర్లను ఏర్పాటుచేయగా వాటిపై వినియోగిస్తున్న భారీ నిర్మాణరంగ క్రేన్ అదుపుతప్పి ఈ రైలుపై పడిందని అక్కడి అధికారులు వివరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు రవాణా శాఖ మంత్రి ఫిఫాట్ రాచకిత్ప్రకరణ్ చెప్పారు.
Construction crane for high-speed rail bridge collapsed onto moving passenger train in Sikhiu, Nakhon Ratchasima this morning (14 Jan) at 9:05 am. Train derailed and caught fire. 30+ passengers injured, many trapped in carriages. Multiple rescue teams deployed. pic.twitter.com/X4c0vyQIwA
— PR Thai Government (@prdthailand) January 14, 2026


