హనీమూన్‌ జంట కేసులో బిగ్‌ ట్విస్ట్.. ప్లాన్‌ ప్రకారమే భార్య.. | Indore Couple Meghalaya Missing Case Mystery, Know What Witnesses Said About What Happened Before They Disappeared | Sakshi
Sakshi News home page

హనీమూన్‌ జంట కేసులో బిగ్‌ ట్విస్ట్.. ప్లాన్‌ ప్రకారమే భార్య..

Jun 9 2025 8:16 AM | Updated on Jun 9 2025 10:42 AM

Tourist Couple Meghalaya Village Before they Disappeared what Witnesses Said

గౌహతి/షిల్లాంగ్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన కొత్త జంట హనీమూన్‌కు వెళ్లి, అదృశ్యమైన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ కేసును చేధించారు. ఈ ఉదంతంలో భర్త రాజా రఘువంశీ హత్యకు గురికాగా,  భార్య సోనమ్‌ కనిపించకుండా పోయింది. తాజాగా ఆమెను ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

భర్త హత్య కేసులో ఆమెను నిందితురాలిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం సోనమ్ కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుని, భర్తను హత్య చేయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఇదాషిషా నోంగ్‌రాంగ్ మాట్లాడుతూ సోనమ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో అదుపులోకి తీసుకున్నామని,  ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న  మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు.

దర్యాప్తు జరిగిదిలా..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ సోనమ్‌ దంపతులు మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌లోని నోంగ్రియాట్ గ్రామంలో గడిపిన 12 గంటల సమయంలో వారు ఏమి చేశారనేది ఆధారంగా చేసుకుని, పోలీసులు దర్యాప్తులో ముందుకు సాగారు. ఇందుకోసం వారు స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. మే 23న కనిపించకుండా పోయిన వీరు దీనికి ముందు మేఘాలయలోని  కొన్ని ప్రాంతాలను సందర్శించారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం ఒక లోయలో లభ్యమయ్యింది. అతని భార్య సోనమ్‌ ఆచూకీ కోసం పోలీసులు పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలు గాలించాయి. సోనమ్‌ కుటుంబ సభ్యులు ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి  ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు.

మే 21న మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఒక గెస్ట్‌హౌస్‌కు ఆ జంట ముందుగా చేరుకుంది. మరుసటి రోజు వారు స్కూటీని అద్దెకు తీసుకుని,  పర్యాటక ప్రదేశం సోహ్రా (చిరాపుంజి)కి వెళ్లారు. తరువాత వారు తూర్పు ఖాసీ హిల్స్‌లోని మావ్లాఖియాట్ గ్రామానికి చేరుకుని, స్కూటీని పార్కింగ్ స్థలంలో ఉంచారు. అక్కడ ట్రెక్కింగ్ చేసేందుకు స్థానిక గైడ్‌ను సంప్రదించారు.  అతను మావ్లాఖియాట్ నుండి నాంగ్రియాట్‌కు ట్రెక్కింగ్‌కు  చేరేందుకు మూడు గంటలు పడుతుందని,  మూడు వేల మెట్లు దిగాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పటికే టైమ్‌ అయిపోయిందని, మర్నాడు వెళ్లవచ్చని గైడ్‌ వారికి చెప్పాడు. అయితే ఆ జంట తమకు రూట్‌ తెలుసని, గైడ్‌ సర్వీస్‌ అవసరం లేదని చెప్పారు.

కాగా రాజా రఘువంశీ సోనమ్‌ దంపతులకు హోమ్‌ స్టే కల్పించిన ఒక మహిళ పోలీసులు విచారణలో వారిద్దరూ సాయంత్రం 5.30 గంటలకు నోంగ్రియాట్ గ్రామంలోని తమ షిపారా హోమ్‌స్టేకు  వచ్చారని తెలిపారు. తాను రూమ్‌ ఛార్జీలు తీసుకుని, రిజిస్టర్‌లో సైన్ ఇన్ చేయమని చెప్పి, వారి గదిని చూపించానన్నారు. వారు చెక్ ఇన్ చేసి, గదికి తాళం వేసి లివింగ్ రూట్ బ్రిడ్జిలను చూడటానికి వెళ్లారని ఆ మహిళ చెప్పారు. కొద్దిసేపటి తర్వాత వారు తిరిగి వచ్చి, భోజనం చేసి, రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారని ఆమె తెలిపారు.



ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి బంగ్లా యూనస్‌ లేఖ.. ఏమన్నారంటే.. 

మరుసటి రోజు ఉదయం ఆ జంట త్వరగా చెక్ అవుట్ చేస్తామని  హోమ్‌స్టే యజమానికి చెప్పారు. అల్పాహారం వద్దని, ఆకలిగా లేదని చెప్పి ట్రెక్కింగ్‌ కోసం వెళతామని అతనితో అన్నారు. మే 23న ఉదయం 6 గంటలకు ఆ జంట హోమ్‌స్టే నుండి బయలుదేరింది. ఆ జంటను చూసిన చివరి వ్యక్తి గైడ్ ఆల్బర్ట్ పిడే. పోలీసుల విచారణలో అతను 23న ఉదయం 10 గంటల సమయంలో ఆ జంట ముగ్గురు టూరిస్టులతో పాటు మావ్లాఖియాత్ గ్రామం వైపు వెళ్లడం చూశానని తెలిపాడు. ఆ తర్వాత  నుంచి ఆ జంట కనిపించకుండా పోయింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement