పాల వ్యాపారితో వివాహేతర సంబంధం.. | Tamilnadu women Latha Incident | Sakshi
Sakshi News home page

పాల వ్యాపారితో వివాహేతర సంబంధం..

Aug 26 2026 12:47 PM | Updated on Aug 26 2026 12:49 PM

Tamilnadu women Latha Incident

తమిళనాడు: ఆవడి సమీపం కర్లబాక్కం యాదవర్‌ వీధికు చెందిన లతా(45). ఈమె కర్లబాక్కం పంచాయతీలో క్లీనర్‌గా పని చేస్తోంది. ఈమె భర్త, సుబ్రమణి 8 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. వీరికి పిల్లలు లేరు. దీంతో ఆమె తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ వచ్చింది. ఈనెల 20వ తేదీ లత పనికి వెళ్లి వచ్చిన తర్వాత ఆమె ఇంటి నుండి బయటకు రాలేదు. 

ఆమె ఇంటి తలుపు బయటి నుండి తాళం వేసి ఉంది. ఈ స్థితిలో, మంగళవారం లత ఇంట్లో నుండి దుర్వాసన వచ్చింది. దీంతో ఇరుగుపొరుగు వారు ముక్తపుదుపేట్టై  పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సెల్వి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఆ సమయంలో, పడకగదిలో లత తలకు గాయాలతో, కుళ్లిపోయిన స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఆమె ధరించిన ఆభరణాలు గానీ, ఇంట్లోని వస్తువులు గానీ ఏవీ దొంగిలించబడలేదు. అనంతరం, పోలీసులు లత మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం చెన్నైలోని కిల్పాకం  ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు. అవడి ముక్త పుదుపేట్టై పోలీసులు అనుమానాస్పద మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విచారణ లో అదే ప్రాంతానికి చెందిన మునివేల్‌ (65) అనే పాల వ్యాపారితో లతకు అక్రమ సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో, పోలీసులు  మునివేల్‌ను అరెస్టు చేసి విచారణ జరిపారు. విచారణ సమయంలో, తానే లతను చంపానని అతను చెప్పాడు. చాలా కాలంగా లతతో తనకు అక్రమ సంబంధం ఉందని  చెప్పాడు. లత కొన్ని రోజులుగా చాలా మంది పురుషులతో సంబంధం పెట్టుకోవడంతో కొట్టి చంపినట్లు తెలిపాడు. దీంతో మునివేల్‌ను పుళల్‌ జైలుకు తరలించారు.   

చదవండి: యువతి గదిలో కెమెరా పెట్టిన ఇంటి యజమాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement