సాక్షి, సూర్యాపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కంటైనర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 23 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బుధవారం వేకువ జామున హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రెష్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఈ ప్రమాదానికి గురైంది. రంగంలోకి దిగిన పోలీసులు గాయపడిన వాళ్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదానికి కారణాలు.. మృతుల పేర్లు.. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఈ ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు క్లియర్ చేసే పనిలో ఉన్నారు.


