కరోనాతో సితార్‌ విద్వాంసుడు కన్నుమూత

Sitar Maestro Pandit Devabrata Chaudhuri Dies Of Covid - Sakshi

న్యూఢిల్లీ: కరోనా ధాటికి మరో ప్రముఖుడు కన్నుమూశాడు. ప్రముఖ సితార్‌ విద్వాంసుడు పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత దేవబ్రత చౌదరి (85) మృతిచెందారు. తన తండ్రి మరణించినట్టు ఆయన కుమారుడు ప్రతీక్‌ చౌదరి సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల కరోనా పాజిటివ్‌ తేలగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్న ఆయన ఆక్సిజన్‌ స్థాయి శుక్రవారం ఒక్కసారిగా పడిపోయింది. సంగీత ప్రపంచానికి పండిత్‌ దేవబ్రత చౌదరి అరవై ఏళ్ల పాటు విశేష సేవలందరించారు. ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌, సంగీత నాటక అకాడమీ అవార్డులను ప్రకటించింది. ఆయన మృతికి కేంద్ర సాంస్కృతిక శాఖ సంతాపం ప్రకటించింది. 

చదవండి: కరోనా పేషెంట్‌కు ఆవు మూత్రం పోసిన నేత
చదవండి: సంతలో లస్సీ.. 100 మంది ప్రాణం మీదకు వచ్చింది..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top