
చత్తీస్గఢ్: బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈరోజ(శుక్రవారం) జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా బండి ప్రకాష్ మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాష్. సింగరేణి కార్మిక సమాఖ్య ఇంచార్జ్గా పనిచేశారు.
కాగా, నిన్న(గురువారం) . బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నరసింహ అలియాస్ సుధాకర్ మృతిచెందారు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో సుధాకర్ మృత్యువాత పడ్డారు.
ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం చర్యలు చేపట్టింది. తమతో చర్చలు జరపాలనే మావోయిస్టు పార్టీ ఇదివరకే విజ్ఞప్తి చేసినా అ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హిడ్మాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతిచెందడం మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నారు సుధాకర్. అయితే గత ఆరు నెలల్లో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. సుధాకర్పై రూ. కోటి రివార్డు ఉంది. 2004లో ప్రభు త్వంతో జరిగిన చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు.
కాగా, వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో ఆపరేషన్ కగార్ ఒకటి. ఇది గతేడాది నుంచి ఊపందుకోగా, ఈ ఆపరేషన్ అనేక మంది మావోయిస్టుల కీలక నేతలు హతమయ్యారు. దేశ వ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం తన చర్యలను ముమ్మరం చేసింది.