సంభాల్‌ మసీదు బావి వివాదం.. యథాతథ స్థితిని కొనసాగించండి | SC stays execution of Sambhal civic body notice on well near Shahi Jama Mosque | Sakshi
Sakshi News home page

సంభాల్‌ మసీదు బావి వివాదం.. యథాతథ స్థితిని కొనసాగించండి

Jan 11 2025 5:05 AM | Updated on Jan 11 2025 5:05 AM

SC stays execution of Sambhal civic body notice on well near Shahi Jama Mosque

న్యూఢిల్లీ: సంభాల్‌లోని మొఘలుల నాటి జామా మసీదు సమీపంలోని వివాదాస్పద బావిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని శుక్రవారం సుప్రీంకోర్టు భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ)తోపాటు ఉత్తరప్రదేశ్‌ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి జామా మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. 

ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రం, ఏఎస్‌ఐలతోపాటు సంభాల్‌ జిల్లా మేజిస్ట్రేట్‌కు, హరి శంకర్‌ జైన్‌ తరపున ఉన్న హిందూ కక్షిదారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21వ తేదీన ఉంటుందని, రెండు వారాల్లోగా అక్కడి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బావికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్ట రాదని స్పష్టం చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు మసీదులో చేపట్టిన సర్వే నివేదికను సీల్డ్‌ కవర్‌లోనే ఉంచాలంది. 

Advertisement
 
Advertisement
Advertisement