రన్యారావ్‌ పాత్రధారి మాత్రమే | Ranya Rao gold smuggling case | Sakshi
Sakshi News home page

రన్యారావ్‌ పాత్రధారి మాత్రమే

Published Fri, Mar 7 2025 10:52 AM | Last Updated on Fri, Mar 7 2025 11:18 AM

Ranya Rao gold smuggling case

బంగారం రవాణా కింగ్‌పిన్‌ వేరే

పోలీసు విచారణలో గుట్టురట్టు 

బనశంకరి: బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్‌ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్తి అని తెలిసింది. నటి రన్యారావ్‌ను డీఆర్‌ఏ అధికారులు తీవ్ర విచారణ చేపట్టగా నేను పాత్రధారి మాత్రమే అని, అసలు వ్యక్తి వేరేవారని తెలిపింది. రూ.17 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసే శ్రీమంతురాలు కాదు. 

ఈమె సీనియర్‌ పోలీస్‌ అధికారి పెంపుడు కూతురు కావడంతో ఆమెను ఈ దందాకు వాడుకుంటే చాలా సులభంగా బంగారం రవాణా చేయవచ్చనే అంచనాతో నటి రన్యారావ్‌ను బంగారం రవాణాకు వాడుకున్నారు. అక్రమ బంగారం రవాణాలో విమానాశ్రయంలోని కొందరు అధికారులు  కూడా కుమ్మక్కైనట్లు అనుమానం వ్యక్తమైంది.

డీఆర్‌ఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. బంగారం రవాణాలో రన్యారావ్‌కు  రూ.4 లక్ష లనుంచి రూ.5 లక్షలు కమీషన్‌ ఇస్తున్నట్లు తెలిసింది. రన్యారావ్‌ బెంగళూరుకు తీసుకువచ్చిన బంగారం ఎవరికి ఇస్తుంది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రన్యారావ్‌ వాడుతున్న బ్యాంక్‌ అకౌంట్‌ మొబైల్‌ను అదికారులు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ అధికారులు అసలు సూత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.   

వీడియో: కర్ణాటకలో​ దారుణం.. పెళ్లి పేరుతో మైనర్‌ను బలవంతంగా లాక్కెళ్లి..



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement