మాల్దీవులకు భారత్‌ గస్తీ నౌక, ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ | Rajnath Singh To Hand Over Patrol Vessel, Landing Craft To Maldives | Sakshi
Sakshi News home page

మాల్దీవులకు భారత్‌ గస్తీ నౌక, ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌

May 1 2023 5:40 AM | Updated on May 1 2023 5:40 AM

Rajnath Singh To Hand Over Patrol Vessel, Landing Craft To Maldives - Sakshi

న్యూఢిల్లీ: కీలకమైన మిత్రదేశమైన మాల్దీవులకు భారత్‌ గస్తీ నౌక, ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌లను కానుకగా అందివ్వనుంది. మే ఒకటి నుంచి మూడో తేదీ వరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వీటిని అందజేస్తారు.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో కొంతకాలంగా పెరుగుతున్న చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే దిశగా భారత్‌ తీసుకుంటున్న చర్యల్లో ఇది భాగమని చెబుతున్నారు. పర్యటనలో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్, విదేశాంగ మంత్రి అబ్దుల్లా సాహిత్, రక్షణ మంత్రి మరియా దీదీతోనూ రాజ్‌నాథ్‌ చర్చలు జరుపుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement