
చెన్నై: ఆపరేషన్ సిందూర్పై జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ దాడుల్లో భారత్కు నష్టం కలిగిందంటూ విదేశీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. భారత్ దాడిలో 30 పాక్ ఎయిర్బేస్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. పాక్ దాడుల్లో భారత్కు నష్టం జరిగినట్టు ఒక్క ఫోటో చూపాలని సవాల్ విసిరారు.
చైన్నైలోని ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవం కార్యక్రమంలో దోవల్ మాట్లాడుతూ, ఆ దేశంలో ఉగ్ర స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే అత్యంత కచ్చితమైన సమాచారంతోనే భారత బలగాలు దాడులు చేశాయని వివరించారు. పాకిస్తాన్లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫొటోలు మాత్రమే బయటకు వచ్చాయని.. భారత్కు నష్టం జరిగినట్లు ఒక్క ఫొటో కూడా లేదన్నారు.
భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను, యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన సాధన సంపత్తిని దేశీయంగానే రూపొందిస్తోందని అజిత్ దోవల్ వెల్లడించారు. పాక్ సైన్యం ఢిల్లీ టార్గెట్గా ప్రయోగించిన ఫతాహ్-11 బాలిస్టిక్ క్షిపణులను భారత సైన్యం.. గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400తో సమర్థవంతంగా పేల్చివేశాయని వివరించారు. భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని ప్రశంసించిన అజిత్ దోవల్.. ‘‘మేము గర్విస్తున్నాం.. 23 నిమిషాల్లో తొమ్మిది లక్ష్యాలను ఛేదించాం’’ అని పేర్కొన్నారు.