నోయిడా వాసికి రూ.4 కోట్ల కరెంటు బిల్లు | Noida Resident Gets Rs 4 Crore Electricity Bill | Sakshi
Sakshi News home page

నోయిడా వాసికి రూ.4 కోట్ల కరెంటు బిల్లు

Jul 21 2024 9:03 AM | Updated on Jul 21 2024 12:10 PM

Noida Resident Gets Rs 4 Crore Electricity Bill

నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో రైల్వే ఉద్యోగి బసంత్‌శర్మకు జూన్‌ నెల కరెంటు బిల్లు షాక్‌ ఇచ్చింది. ఓ రోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరుతుండగా అద్దెకు ఇచ్చిన తన ఇంటికి సంబంధించి  కరెంటు బిల్లు మెసేజ్‌ వచ్చింది.

ఏకంగా రూ.4 కోట్ల కరెంటు బిల్లు జులై 24కల్లా కట్టాలని ఆ మెసేజ్‌లో ఉంది. అది చూసి తొలుత ఆశ్చర్యపోయి తర్వాత కంగారుపడ్డాడు. టెనెంట్‌కు ఫోన్‌ చేసి కనుక్కుంటే సాధారణంగా వాడినట్లే జూన్‌లోనూ విద్యుత్‌ వాడామని సమాధానమిచ్చాడు.

దీంతో బసంత్‌శర్మ విద్యుత్‌ అధికారులకు ఫోన్‌ చేశాడు. వారు చెక్‌చేసి చూడగా ఎర్రర్‌ కారణంగా కంప్యూటర్‌ జనరేటెడ్‌ బిల్లులో పొరపాటు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. బిల్లును సరిచేసి పంపడంతో బసంత్‌ శర్మ ఊపిరి పీల్చుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement