రాష్ట్ర ప్రభుత్వాలకు NHRC నోటీసులు జారీ చేసింది. జాతీయ స్కూల్ బ్యాగ్ విధానం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేట్ స్కూళ్లపై నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అయితే తమ తమ వద్దే పాఠ్య పుస్తకాలు కోనుగోలు చేయాలని ప్రైవేట్ పాఠశాలలు తమపై ఒత్తిడి చేస్తున్నాయని విద్యార్థులు NHRCకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.


