
న్యూఢిల్లీ: దేశంలో వైద్య విద్యలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించిన నీట్ యూజీ-2025 ఫలితాలు ఈ రోజు (జూన్ 14)విడుదలయ్యాయి. తుది సమాధానపు కీని కూడా విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా నీట్ యూజీ- 2025 ఫలితాలను తెలుసుకోవచ్చు.
ఇందుకోసం అభ్యర్థులకు వారి అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ అవసరమవుతుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశానికి కటాఫ్ మార్కులను కూడా ఈ ఫలితాలతో పాటు విడుదల చేశారు. గత సంవత్సరం నీట్ పరీక్ష కటాఫ్ గణనీయంగా ఎక్కువగా ఉంది. 2024లో జనరల్, ఆర్థికంగా వర్గాలవారికి కటాఫ్ 162 మార్కులుగా ప్రకటించారు. గత సంవత్సరాల ట్రెండ్లు, ఈ ఏడాది పరీక్ష స్థాయిని పరిగణనలోకి తీసుకున్న దరిమిలా కటాఫ్ కొద్దిగా తగ్గుతుందనే అంచనాలున్నాయి. ఈ సంవత్సరం 20 లక్షలకు పైగా అభ్యర్థులు ‘నీట్’కు హాజరుకాగా, ఈ పరీక్ష 2025, మే 4న జరిగింది.