పని గంటలపై నారాయణమూర్తికి కౌంటర్‌ | Mp Karti Chidambaram Counter To Infosys Murthy | Sakshi
Sakshi News home page

పని గంటల పంచాయితీ: నారాయణమూర్తికి ఎంపీ కార్తీ చిదంబరం కౌంటర్‌

Dec 23 2024 12:37 PM | Updated on Dec 23 2024 1:18 PM

Mp Karti Chidambaram Counter To Infosys Murthy

న్యూఢిల్లీ:ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తికి కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం గట్టి కౌంటర్‌ ఇచ్చారు. భారత్‌లో పనిదినాలు ఆరు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గిపోతుండడంపై మూర్తి ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కార్తీ చిదంబరం ఎక్స్‌(ట్విటర్‌)లో స్పందించారు. ఎన్ని గంటలు ఎక్కువ పనిచేశామన్నది ముఖ్యం కాదని, ఎంత ప్రభావవంతంగా పనిచేశామన్నది ముఖ్యమన్నారు.

‘ఎక్కువ సేపు పనిచేయడమనేది అర్థం లేనిది. ఎంత ఫోకస్‌తో పనిచేశామనేది మఖ్యం. జీవితంలో రోజువారి సమస్యలతో పోరాడే మనుషులకు వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌ అనేది తప్పనిసరి. నిజానికి భారత్‌లో పనిదినాలను వారానికి నాలుగు రోజులకు తగ్గించాలి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే చాలు’అని కార్తీ చిదంబరం తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌గొగోయ్‌ కూడా నారాయణమూర్తి ఎక్కువ పనిగంటల విధానంతో విభేదించడం గమనార్హం.  

 ఇదీ చదవండి: హైదరాబాద్‌పై ఇన్ఫోసిస్‌ మూర్తి కీలక వ్యాఖ్యలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement