కర్ణాటకలో ఘనంగా రాజ్యాంగ పీఠిక పఠనం | Karnataka govt makes reading of Preamble to Constitution mandatory | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఘనంగా రాజ్యాంగ పీఠిక పఠనం

Sep 16 2023 5:14 AM | Updated on Sep 16 2023 5:14 AM

Karnataka govt makes reading of Preamble to Constitution mandatory - Sakshi

బెంగళూరు:  అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ఏకకాలంలో లక్షలాది మంది పాల్గొన్నారు.

బెంగళూరు విధానసౌధ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు ఇతర అతిథులు రాజ్యాంగ పీఠికను కన్నడ భాషలో స్వయంగా పఠించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో నిత్యం ఉదయం ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరిగా చదవాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జూన్‌లో ఉత్వర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement