మెత్తబడ్డ డీకే శివకుమార్‌!.. కీలక వ్యాఖ్యలు | Karnataka Row: Why DK Shivakumar Mention Sonia Gandhi Name | Sakshi
Sakshi News home page

కర్ణాటక పవర్‌ పంచాయితీ: మెత్తబడ్డ డీకే శివకుమార్‌!.. కీలక వ్యాఖ్యలు

Nov 28 2025 6:47 PM | Updated on Nov 28 2025 7:20 PM

Karnataka Row: Why DK Shivakumar Mention Sonia Gandhi Name

కర్ణాటక పవర్‌ పాలిటిక్స్‌లో పూటకో ట్విస్ట్‌ చోటు చేసుకుంటోంది. ఐదేళ్లు తానే సీఎంనంటూ సిద్ధరామయ్య.. అధిష్టానం తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ ఇటు డీకే శివకుమార్‌లు పోటాపోటీగా ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ పంచాయితీ ఢిల్లీకి రేపోమాపో షిఫ్ట్‌ అవుతుందనే ప్రచారం ఇవాళ జోరుకుంది. అయితే ఈలోపే..

కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. పదవీ త్యాగం నేపథ్యంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  బెంగళూరులో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2004లో అధికారాన్ని త్యాగం చేశారు. తనకు బదులుగా మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానిని చేశారు’’ అని అన్నారాయన.

కర్ణాటకలో అధికార పంపిణీపై ఊహాగానాల వేళ ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటనే విశ్లేషణ అక్కడ నడుస్తోంది. ఇప్పటికే రాహుల్‌ గాంధీ రంగంలోకి దిగి కర్ణాటక కాంగ్రెస్‌ సంక్షోభం మరింత ముదరకుండా మంతనాలు జరుపుతున్నారు. సీఎం మార్పు నిర్ణయాన్ని ఇక సోనియా గాంధీకే వదిలేసినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంతో అధిష్టానంతో చర్చించేందుకు రెండ్రోజుల్లో ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. 

ఈలోపు రాహుల్‌ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ కర్ణాటక పరిణామాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. డీకే శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘హైకమాండ్‌ పిలిస్తే కచ్చితంగా ఢిల్లీ వెళ్తా. అధిష్టాన నిర్ణయమే నాకు ఫైనల్‌. ఏ విషయంలోనూ నాకు తొందరలేదు’’ అని అన్నారు. మరోవైపు.. డీకే శివకుమార్‌తో ఉన్న ఫొటోను సిద్ధరామయ్య షేర్‌ చేయడంతో ఈ కథ సుఖాంతం అయ్యిందా? అనే చర్చ జోరందుకుంది.

సీఎం చేంజ్! ఢిల్లీలో అధిష్ఠానం పెద్దల కీలక సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement