కర్ణాటక: ఖైదీలకు సెంట్రల్ జైలులో రాచ మర్యాదలు కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కలబుర్గి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ డాక్టర్ అనితను సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీపీ అలోక్కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
జైలులో ఖైదీలు మొబైళ్లు వాడటం, సిగరెట్లు, మద్యం తాగడం లాంటి దృశ్యాలు సోషల్ మీడియా, న్యూస్ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. ఇందుకు అనితను బాధ్యురాలిని చేస్తూ సస్పెండ్ చేశారు.
చదవండి: జైలు ఖైదీ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా..


