సాక్షి, చెన్నై : పాక్ జలసంధిని ఈది ఐటీ దంపతులు రికార్డు సృష్టించారు. బెంగళూరుకు చెందిన డానిష్ అబ్ది, విశాలి ప్రసిద్ధ్ దంపతులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. బుధవారం వేకువజామున 4.30 గంటలకు శ్రీలంకలోని తలైమన్నార్లో ఈత ప్రారంభించి, మధ్యాహ్నం 3.15 గంటలకు తమిళనాడులోని ధనుష్కోటి చేరుకున్నారు. కేవలం 10.45 గంటల్లో సము్రదాన్ని దాటి పాక్ జలసంధిని ఈదిన మొదటి దంపతులుగా చరిత్ర సృష్టించారు.


