
భారత్తో స్నేహహస్తం కోసం దొంగ ఎత్తుగడలు వేసిన చైసా వైఖరి ఏంటో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో బట్టబయలైంది. పాకిస్తాన్ను అడ్డంపెట్టుకుని భారత్ను దొంగ దెబ్బ తీయాలని చైనా కుతంత్రాలు చేసింది. న్యూట్రల్గా ఉండాల్సిన సమయంలో పాకిస్తాన్కు పూర్తి సహకారం అందిస్తూ భారత్పై తమ వైఖరి ఎప్పుడూ శత్రువైఖరే అనే విషయాన్ని మరోసారి రుజువు చేసుకుంది.
ఇదే విషయాన్ని తాజాగా భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ ఆర్ సింగ్ స్పష్టం చేశారు. ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధం చేస్తూనే చైనా నుంచి కూడా ఇబ్బందికర పరిస్థితిని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఇక టర్కీ సైతం పాకిస్తాన్కు సపోర్ట్ చేయడంతో భారత్ ఒకేసారి మూడు దేశాలతో యుద్ధం చేయాల్సి వచ్చిందన్నారు.
#WATCH | Delhi: At the event 'New Age Military Technologies' organised by FICCI, Deputy Chief of Army Staff (Capability Development & Sustenance), Lt Gen Rahul R Singh says, "Air defence and how it panned out during the entire operation was important... This time, our population… pic.twitter.com/uF2uXo7yJm
— ANI (@ANI) July 4, 2025
ప్రధానంగా చైనా విషయానికొస్తే.. తమ దేశానికి చెందిన వివిధ ఆయుధ వ్యవస్థలను పరీక్షించడానికి భారత్తో పాకిస్తాన్ చేస్తున్న యుద్ధంలో లైవ్ ల్యాబ్ మాదిరిగా ఉపయోగించుకుందన్నారు. వీటిన్నంటిని మనం సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో సఫలమయ్యామని, భారత్ను తక్కువగా చూసిన వారికి ఇదొక చెంపపెట్టులాంటిదని ఆయన హెచ్చరించారు.
న్యూఢిల్లీలో ఎఫ్ఐసీసీసై ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘న్యూ ఏజ్ మిలటరీ టెక్నాలజీ’ ఈవెంట్కు హాజరైన రాహుల్ ఆర్ సింగ్..రాహుల్ ఆర్ సింగ్.. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పలు అంశాలను షేర్ చేసుకున్నారు.
చైనా యొక్క పురాతన 36 సైనిక వ్యూహాలను భారత్పై ప్రయోగించడానికి పాక్కు సహకారం అందించిందన్నారు. అరువు తీసుకున్న కత్తితో భారత్ను దెబ్బకొట్టడానికి పాక్ సన్నద్ధమైందన్నారు. భారత్కు హాని చేసే ప్రక్రియలో భాగంగా పాక్కు చైనా అన్ని విధాల సైనిక సహకారం అందించిందన్నారు.
ఇక టర్కీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని, భారత్ను దెబ్బ కొట్టగానికి లెక్కలేనన్ని డ్రోన్లను పాక్కు పంపించిందన్నారు. ఇలా మూడు దేశాలు కలిసి భారత్పై విరుచుకుపడ్డాయని, దీన్ని మనం సమర్ధవంతంగా తిప్పికొట్టామన్నారు. ఫలితంగా మన సైనిక శక్తి ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటిచెప్పామని రాహుల్ ఆర్ సింగ్ పేర్కొన్నారు.