ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌ | Helicopter crashes in Uttarakhand | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌

May 9 2025 4:44 AM | Updated on May 9 2025 4:44 AM

Helicopter crashes in Uttarakhand

పైలట్‌ సహా ఆరుగురు మృతి

మృతుల్లో ఏపీ ఎంపీ సోదరి సహా ఇద్దరు.. 

తీవ్రంగా గాయపడిన ఏపీ వాసి

గంగోత్రికి వెళ్తుండగా ఘటన

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలో గురువారం జరిగిన ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి సహా ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఎం.భాస్కర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఏరో ట్రాన్స్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన బెల్‌ హెలికాప్టర్‌ డెహ్రాడూన్‌ నుంచి గంగోత్రి సమీపంలోని ఖర్సాలీ హెలిప్యాడ్‌కు టేకాఫ్‌ తీసుకుంది.

ఉదయం 8.45 గంటల సమయంలో రిషికేశ్‌–గంగోత్రి నేషనల్‌ హైవేపై గంగ్నానీ సమీపంలో అదుపు తప్పిన హెలికాప్టర్‌ సుమారు 250 మీటర్ల లోతైన లోయలో కూలిపోయింది. ఆ సమయంలో అందులో పైలట్‌ సహా ఏడుగురున్నారు. ఘటనలో మృతి చెందిన వారిని ఏపీకి చెందిన వేదవది కుమారి(48), విజయా రెడ్డి(57), కళ చంద్రకాంత్‌ సోని(61), రుచి అగర్వాల్‌(56), రాధ అగర్వాల్‌(79), కెపె్టన్‌ రాబిన్‌ సింగ్‌(60)గా గుర్తించారు.

రాబిన్‌ సింగ్‌ స్వస్థలం గుజరాత్‌ కాగా ముగ్గురిది ముంబై, ఒకరిది యూపీ. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏపీ వాసి ఎం.భాస్కర్‌(51)ను వెంటనే మరో హెలిక్టాపర్‌లో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించామని జిల్లా మేజి్రస్టేట్‌ మెహర్బన్‌ సింగ్‌ బిష్త్‌ చెప్పారు. ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాసిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(ఏఏఐబీ) దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement