అమృత్‌సర్‌: రైల్లో మంటలు.. ప్రయాణికుల హహాకారాలు | Fire Broke Out In Train Amritsar, More Details Inside | Sakshi
Sakshi News home page

అమృత్‌సర్‌: రైల్లో మంటలు.. ప్రయాణికుల హహాకారాలు

Jul 14 2024 11:27 AM | Updated on Jul 14 2024 12:47 PM

Fire Broke out in Train Amritsar

పంజాబ్‌లోని అమృత్‌సర్ రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో అమృత్‌సర్-హౌరా మెయిల్ కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు రైలు డ్రైవర్‌కు సమాచారం అందించడంతో వెంటనే రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణం అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రైలులో మంటలు చెలరేగాయని తెలియగానే కొందరు ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగిపోయారు.

ఈ నేపధ్యంలో ఓ మహిళా ప్రయాణికురాలికి కాలికి గాయమైంది. దీంతో అధికారులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. మంటలు చెలరేగిన కంపార్ట్‌మెంట్‌ను రైలు నుంచి వేరు చేశాక, మిగిలిన రైలును అధికారులు గమ్యస్థానానికి తరలించారు. కాగా ఇటీవల మధ్యప్రదేశ్‌లోని విదిశాలో జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. వెంటనే భద్రతా సిబ్బంది రైలును ఆపి, మంటలను అదుపులోకి తెచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement