లిక్కర్‌ స్కామ్‌: ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌లో ఈడీ సోదాలు | ED Raids In Chhattisgarh, Jharkhand In Liquor Scam | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కామ్‌: ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌లో ఈడీ సోదాలు

Oct 29 2024 11:05 AM | Updated on Oct 29 2024 11:16 AM

ED Raids In Chhattisgarh, Jharkhand In Liquor Scam

న్యూఢిల్లీ:లిక్కర్‌ స్కామ్‌లో ఛత్తీస్‌గఢ్‌,జార్ఖండ్‌లలోని మొత్తం 17 చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ఏకకాలంలో సోదాలు చేసింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వినయ్‌కుమార్‌ చౌబే,ఎక్సైజ్‌ ఉన్నతాధికారి గజేంద్రసింగ్‌ నివాసాలు, స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల్లో ఈడీ మంగళవారం(అక్టోబర్‌ 29) తనిఖీలు నిర్వహించింది.

ఐఏఎస్‌ అధికారులతో కలిపి మొత్తం ఏడుగురితో కూడిన సిండికేట్‌పై ఛత్తీస్‌గఢ్‌ యాంటీ కరప్షన్‌ బ్యూరో కేసు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో లిక్కర్‌స్కామ్‌కు పాల్పడడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సిండికేట్‌ భారీగా గండికొట్టిందన్న ఆరోపణలపై కేసు రిజిస్టర్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇదే కేసులో మనీలాండరంగ్‌ కోణంలో దర్యాప్తు చేసేందుకు తాజాగా ఈడీ రంగలోకి దిగింది.    

ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం.. ఏం జరిగిందంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement