‘ఆప్‌’ నేతల ఇళ్లపై ఈడీ దాడులు | ED Raid CM Kejriwal Personal Secretary | Sakshi
Sakshi News home page

Delhi: ‘ఆప్‌’ నేతల ఇళ్లపై ఈడీ దాడులు

Feb 6 2024 11:35 AM | Updated on Feb 6 2024 11:40 AM

ED Raid CM Kejriwal Personal Secretary - Sakshi

మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. మంగళవారం ఈడీ బృందం పదికిపైగా ప్రదేశాలలో తనిఖీలు జరిపింది. ఢిల్లీ జల్‌బోర్డు అవినీతి కేసులో ఈడీ ఈ దాడులను చేపట్టింది.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ఇంట్లో ఈడీ సోదాలు జరిపింది. వాటర్ బోర్డు మాజీ సభ్యుడు శలభ్ కుమార్ ఆస్తులపై కూడా దాడులు జరిగాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఎన్డీ గుప్తా నివాసంలో ప్రస్తుతం ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.

ఇదిలావుండగా ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన రిటైర్డ్ డీజేబీ చీఫ్ ఇంజనీర్ జగదీష్ అరోరా, కాంట్రాక్టర్ అనిల్ అగర్వాల్‌ల ఈడీ కస్టడీని మరో ఐదు రోజుల పాటు పొడిగించారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది.

ఢిల్లీ జల్ బోర్డుకు విద్యుదయస్కాంత ప్రవాహ మీటర్ల సరఫరాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జగదీష్ అరోరా, అనిల్ అగర్వాల్‌లు అరెస్టయ్యారు. ఐదు రోజుల కస్టడీ గడువు ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరి రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ కోరగా, అందుకు అంగీకరించిన కోర్టు ఇద్దరి రిమాండ్‌ను ఐదు రోజుల పాటు పొడిగించింది.

గత ఏడాది నవంబర్ 18, 2023న కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా విలేకరుల సమావేశంలో ఢిల్లీ జల్ బోర్డులో రూ.3,237 కోట్ల కుంభకోణం జరిగినట్లు పేర్కొన్నారు. 2018-19 నుండి 2022-23 మధ్య బోర్డు ఆర్థిక వ్యయానికి సంబంధించిన సమాచారం దాచిందని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో బోర్డులో అనేక ఆర్థిక అవకతవకలు వెలుగు చూశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement