మన సంస్కృతితో యువత బంధం బలీయం: ప్రధాని | Sakshi
Sakshi News home page

మన సంస్కృతితో యువత బంధం బలీయం: ప్రధాని

Published Sun, Jun 18 2023 6:40 AM

Deepened bond between our youth and culture - Sakshi

న్యూఢిల్లీ: మన దేశ అద్భుతమైన వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం, గౌరవించడం కోసం కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా చేపట్టిన అనేక చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. ఘనమైన మన సాంస్కృతిక వారసత్వ సంపద మనకు గర్వకారణమన్నారు. తమ ప్రభుత్వం సాగించిన ప్రయత్నాల ఫలితంగానే మన యువతకు సంస్కృతితో బంధం బలపడిందని అన్నారు.

శనివారం ఆయన ట్విట్టర్‌లో ‘9ఇయర్స్‌ ఆఫ్‌ ప్రిజర్వింగ్‌ కల్చర్‌’పేరుతో హాష్‌ట్యాగ్‌ చేశారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆయన పలు ట్వీట్లు చేశారు. దేశ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement