CBSE Students Can Now Learn 22 Languages - Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ బోధన... ఇకపై తెలుగులో కూడా

Jul 24 2023 4:44 AM | Updated on Jul 24 2023 2:10 PM

CBSE students can now learn in 22 languages - Sakshi

భువనేశ్వర్‌: ఉన్న సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) స్కూళ్లలో విద్యార్థులు ఇకపై తెలుగుతో పాటు 22 భారతీయ భాషల్లో చదువుకోవచ్చు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదివారం ఈ మేరకు వెల్లడించారు.

ప్రస్తుతం వాటిల్లో హిందీ, ఇంగ్లిష్‌ మీడియాల్లో మాత్రమే చదువుకునేందుకు వీలుంది. ఇకపై రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో గుర్తించిన తెలుగు, బెంగాలీ, కన్నడ, కొంకణి, మరాఠీ, పంజాబీ, సంస్కృతం, తమిళం, మైథిలి, డోగ్రీ వంటి 22 భాషల్లో తమకిష్టమైన వాటిలో చదువుకోవచ్చు. పరీక్షలు కూడా ఆయా భాషల్లోనే జరుగుతాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement