
24న ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి బ్లాక్బాక్స్
సాక్షి, న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో ఈ నెల 12న చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంపై ‘ఎయిర్క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’(ఏఏఐబీ) నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని కేంద్ర పౌర విమానయానశాఖ తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లభించిన బ్లాక్బాక్స్ను ఢిల్లీకి తరలించినట్లు తెలిపింది. ఈ బృందంలో ఒక ఏవియేషన్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఏటీసీ అధికారి, బోయింగ్ విమానాల తయారీ, డిజైన్ను రూపొందించిన అమెరికా సంస్థ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్బీ) ప్రతినిధులు ఉంటారని పేర్కొంది.
కాక్పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్(ఎఫ్డీఆర్) రెండూ ఏఏఐబీ) ఆధీనంలో ఉన్నాయని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ‘ఈ నెల 25న ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ యుగంధర్ సారథ్యంలోని బృందం ఏఏఐబీ, ఎన్టీఎస్బీకి చెందిన సాంకేతిక సభ్యులు సమాచార వెలికితీత ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా బ్లాక్ బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ (సీపీఎం)ను సురక్షితంగా వెలికి తీశారు. మెమరీ మాడ్యూల్ను విజయవంతంగా తెరిచాం. డేటాను ఏఏఐబీ ల్యాబ్లో డౌన్లోడ్ చేశాం. కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్), విమాన డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్) విశ్లేషణ మొదలైంది. ఇది ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పునరి్నర్మించడంతో పాటు విమానయాన భద్రతను మెరుగు పరిచేందుకు సహాయపడుతుంది’అని పౌర విమానయాన శాఖ తెలిపింది.