ఉగ్రవాదానికి భారత్‌ తలొగ్గదు: అమిత్‌ షా | Amit Shah Paid Last Respects To Tourists Who Died In Pahalgam Terror Attack, Says Bharat Will Not Bend To Terror | Sakshi
Sakshi News home page

Pahalgam Terror Attack: ఉగ్రవాదానికి భారత్‌ తలొగ్గదు.. వారిని వదిలిపెట్టబోం: అమిత్‌ షా

Apr 23 2025 1:57 PM | Updated on Apr 23 2025 3:44 PM

Bharat will not bend to terror Says Home Minister Amit Shah

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్‌కు చేరుకున్న అమిత్ షా.. పుష్పగుచ్ఛం సమర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎక్స్‌ ఖాతాలో ఆయనొక పోస్ట్‌ ఉంచారు.

భారమైన హృదయంతో పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులు. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం. బాధితుల ఆవేదనను ప్రతీ భారతీయుడు అనుభవిస్తున్నాడు అని ట్వీట్‌ చేశారాయన.

పహల్గాం ఉగ్రదాడి సమాచారం అందుకున్న వెంటనే మంగళవారమే అమిత్‌ షా జమ్ము కశ్మీర్‌ చేరుకున్నారు. బుధవారం ఉదయం మృతులకు నివాళులర్పించిన అనంతరం.. బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలు కన్నీళ్లతో షాను వేడుకుంటున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఈ సందర్భంగా.. ఘటన వెనక ఉన్నవారిని వదిలిపెట్టబోమని బాధిత కుటుంబాలతో అమిత్‌ షా స్పష్టం చేశారు. 

కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అమిత్ షా

ఆపై కాల్పులు జరిగిన ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించిన ఆయన.. అధికారుల నుంచి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement