30 ఏళ్ల స్నేహం.. చిచ్చు రేపిన ఎఫైర్‌ | Bengaluru Man 30 Year Friendship Ends In Wife Love Issue, More Details Inside | Sakshi
Sakshi News home page

స్నేహితుడి భార్య‌తో వివాహేత‌ర సంబంధం..

Aug 13 2025 8:44 AM | Updated on Aug 13 2025 1:29 PM

Bengaluru Man 30 Year Friendship Ends

కర్ణాటక: వారిద్ద‌రూ చిన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులు. 30 ఏళ్ల స్నేహం వారిది. అందులో ఒక‌రు స్నేహితుడి భార్య‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకోవ‌డంతో చిచ్చు రేగింది. ఫ‌లితంగా ఇద్ద‌రు మిత్రుల్లో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, మ‌రొక‌రు హత్య కేసులో ఇరుక్కున్నాడు.

విజయ్ కుమార్, ధనంజయ అలియాస్ జే మూడు దశాబ్దాలకు పైగా స్నేహితులు. బెంగళూరులోని మాగడి ప్రాంతంలో కలిసి పెరిగారు. తరువాత సుంకడకట్టే ప్రాంతానికి మారారు. ధనంజయ ఆటోడ్రైవ‌ర్ కాగా, విజ‌య్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ చేస్తున్నాడు. దాదాపు పదేళ్ల క్రితం ఆశ అనే యువ‌తిని వివాహం చేసుకుని, కామాక్షిపాల్యలో కాపురం పెట్టాడు. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో ధనంజయ క‌ల్లోలం రేపాడు. విజ‌య్ భార్య ఆశ‌తో వివాహేత‌రం సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష‌యం తెలియ‌డంతో విజ‌య్ త‌న కాపురాన్ని కడబగెరె సమీపంలోని మాచోహళ్లికి మార్చాడు. అయినా ఆశతో ధ‌నంజ‌య‌ ఎఫైర్ కొన‌సాగించ‌డంతో పంచాయితీ పోలీసుల‌కు వ‌ద్ద‌కు చేరింది. ఇరువ‌ర్గాల‌కు పోలీసులు సర్దిచెప్పి పంపించారు.

మరోవైపు త‌న సంసారంలో నిప్పులు పోసిన‌ ధనంజయ్‌ని చంపేస్తానని విజయ్‌కుమార్‌ చెప్పుకుని తిరుగుతుండేవాడు. అత‌డు అన్నంత ప‌ని చేస్తాడ‌నే భ‌యంతో విజయ్‌కుమార్‌ని హత్య చేయాలని ధనంజయ స్కెచ్‌ వేశాడు. సోమవారం రాత్రి విజయ్‌కుమార్‌ ఇంట్లోంచి బయటకు రాగానే తన గ్యాంగ్‌తో కలిసి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశాడు. మాదనాయకనహళ్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి  విజయ్‌కుమార్ భార్య ఆశను అదుపులోకి తీసుకున్నారు. ధనంజయ్‌, అత‌డి గ్యాంగ్‌ కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement